Publish Date:Aug 25, 2022
మొన్నటి దాకా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరిపైనా నోరు పారేసుకున్నారు. అందుకు బహుమతిగా మంత్రి పదవి ఊడింది. తాజా మంత్రి కాకాణిపైనా రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా కలిసి తోక కట్ చేసి ఓ మూలన పడేశారు. ఆయనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరుస పరాభవాలతో ఇప్పటికే తలపట్టుకుంటున్న అనిల్ కు ఇప్పుడు సొంత బాబాయ్ రూపంలో మరో గండం తరుముకొస్తోంది. 2024 ఎన్నికల్లో అనిల్ కు చుక్కలు చూపిస్తానంటున్నారు ఆయన బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.
నిన్నటి దాకా అనీల్ కుమార్ ను అన్నీ తానై నడిపిన రూప్ కుమార్ ఒక్కసారిగా అబ్బాయ్ అనిల్ పై ఇంతలా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ, అటు నెల్లూరు జనంలోనూ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందిజరుగుతోంది. అనిల్ ను చేరదీసి కార్పొరేటర్ ని చేసి, నెల్లూరు నగర ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించిన ఆనం కుటుంబాన్నే వెన్నుపొటు పొడిచారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కు రూప్ కుమార్ అండ అంతా..ఇంతా కాదు. నెల్లూరులో అనిల్ రాజకీయాలు చేయడానికి ఒక రకంగా రూప్ కుమారే కారణం. నోటి దురుసుతో అందరినీ దూరం చేసుకున్న అనిల్ కు ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్ తలనొప్పిగా మారారు.
అనిల్ ఆఫీసుకు కొద్ది దూరంలో జగనన్న భవన్ అని కొత్త కార్యాలయాన్ని రూప్ కుమార్ ప్రారంభించారు. కార్యకర్తలను భారీగా సమీకరించి అనిల్, తాను విడిపోయామనే సంకేతం పంపారు రూప్ కుమార్. అది జరిగిన రెండు రోజులకే రూప్ కుమార్ వర్గంపై కేసులు బనాయించే ప్రయత్నం చేసేలా పోలీసులను అనిల్ పురమాయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూప్ కుమార్ పోలీస్ స్టేషనులోనే తిష్టవేసి, తన అనుచరులను విడిపించుకున్నారు. అంతటితో ఆగకుండా అనిల్ ఇది జెస్ట్ ట్రయల్ మాత్రమే.. త్వరలో త్రిబులార్ సినిమా చూపిస్తానని హెచ్చరించారు. పెద్ద..పెద్ద కుటుంబాలనే ఓ ఆటాడుకున్నా.. అనిల్ ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటూ రూప్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో నెల్లూరు సిటీలో అనిల్ పరువు కాస్తా గంగలో కలిసిందంటున్నారు.
ఎంత అబ్బాయ్ అయితే మాత్రం.. సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీమంత్రి అందులోనూ జగన్ వదిలిన ‘బూతు బాణం’.. అనిల్ కుమార్ నే హెచ్చరించడంతో రూప్ కుమార్ వార్తల్లోకెక్కారు. ఇప్పుడు రూప్ కుమార్ వేరుకుంపటి పెట్టడంతో బాబాయ్- అబ్బాయ్ మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uncle-rupkumar-revolt-on-anil-kumar-yadev-39-142608.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.