Publish Date:Nov 29, 2019
హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TS 07 EB 3680 నెంబరు కారు పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 221 ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన స్టూడెంట్స్ ఉదయశంకర్, తరుణ్ గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. కారు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వాళ్లు మాదాపూర్ లో ప్రైవేట్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి రాజేంద్ర నగర్ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అతివేగంగా నడపడం వల్లే కారు నుజ్జు నుజ్జు అయ్యిందని.. ఆ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణం ఏంటి..ఆ కారు ఎవరిది.. అనే విషయం మీద ఆరా తీస్తున్నారు.
మొత్తం 9 మంది విద్యార్థుల్లో గణేష్ అనే విద్యార్థి రాత్రి 9:30కు క్యాంపస్ నుండి బయటకు వచ్చాడు. అక్కడి నుండి నేరుగా కోంపల్లిలో ఉన్న తాత ఇంటికి వెళ్లాడు. గణేష్ తాత టాటా సఫారీ వాహనాన్ని తీసుకొని శంషాబాద్ ఏయిర్ పోర్టు వైపు రావడం జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ 9 మంది విద్యార్థులు ప్రీప్లాన్డ్ గా ఇక్కడకు వచ్చి పార్టీ చేసుకొని ఉదయం 5 గంటల లోపే హాస్టల్ కి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో 2 గంటల ప్రాంతంలో పార్టీ ముగించుకున్నారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణమై ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదంలో ముందు కూర్చున్న ఉదయ్ శంకర్, తరుణ్ ఇద్దరూ కూడా స్పార్ట్ లోనే చనిపోయారు. డ్రైవర్ వెనుకాల కూర్చున్న శశాంఖ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న మిగతా ఆరుగురుకి కేవలం స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి వాళ్ళంత అక్కడ నుంచి పరారైపోయారు. అయితే వీరంతా మద్యం సేవించి ఉన్నారా లేరా అనేటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-students-killed-in-hyderabad-car-accident-25-91758.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.