Publish Date:Nov 29, 2019
తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మరోసారి ప్రత్యక్షమయ్యారు. డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చేందుకు నాలుగు నెలల నుంచి ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాన మంత్రి పరిధిలో ఉండే కేంద్ర సిబ్బంది, శిక్షణ ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారులను కలిసేందుకు గురువారం( నవంబర్ 28న ) పార్లమెంట్ కు వచ్చిన ఆమె వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంట కనిపించారు. కేసుల నేపథ్యంలో ఆమెను డిప్యుటేషన్ పై పంపడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నట్లు సమాచారం. సీబీఐ కేసుల్లో ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర బదిలీకి ఎలా అవకాశమిస్తామని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
లక్ష్మి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి కాదు..రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీకి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుని తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించినా కేంద్రం వ్యతిరేకించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆమె నిందితురాలు కావడమే దీనికి కారణమని తెలుస్తొంది. ఆమె ఢిల్లీలో మకాం వేసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులను కలుస్తున్నారు. ఆయన లేనప్పుడు విజయసాయిరెడ్డి వెంట వెళ్లి వారితో సమావేశమవుతున్నారు.
డిప్యుటేషన్ కు అనుమతి రాకున్నా శ్రీలక్ష్మి ఆంధ్రా భవన్ లోనే మకాం పెట్టడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ కేడర్ ఐఏఎస్ కు ఇక్కడ క్యాటగిరీ 1 గది కేటాయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. దీనికి తోడు ఆమెకు కారు కూడా ఏపీ భవన్ సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రాకు చెందిన ముఖ్య కార్యదర్శి కి ఇచ్చే సదుపాయాలన్నీ తెలంగాణ అధికారిణి కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులు ఆమెకు ఆంధ్రా భవన్ లోనే వసతి కల్పిస్తున్నారు. ఒకవేళ డిప్యుటేషన్ ఖాయమైతే ఆమె నేరుగా జగన్ పేషీలో నియమితులు కావచ్చని ఆ భయంతోనే ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-officer-srilakshmi-is-accommodated-unofficially-in-ap-bhavan-25-91757.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు