Publish Date:Jan 21, 2022
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి నిద్ర లేచారు. తమ పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామపై ట్వీట్ ఫైట్కి దిగారు. ఈయనేదో నిఖార్సైన లీడర్గా.. ఆయన్ను ఏదో గిల్లాలని చూశారు. గిల్లితే గిల్లించుకునే రకం కాదుగా రఘురామా. అందుకే, లెక్కకు లెక్క సరి చేశారు. ట్వీట్కు ట్వీట్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. విజయసాయి, రఘురామల మధ్య జరిగిన ఆ ట్విటర్ వార్.. రచ్చ రంబోలాగా మారింది.
మొదట.. విజయసాయినే మొదలుపెట్టారు. జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా!.. అంటూ ఏదేదో అన్నారు. పెయిడ్ మైక్.. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్మెంట్లు.. నీచపు జీవితం.. ప్రజలను తాకట్టు.. ఇలా ఏదేదో అనేశారు విజయసాయి. రఘురామ ఊరుకుంటారా? స్ట్రాంగ్ రిటార్డ్ ఇచ్చారు. అవునా? ఏ1కు భారంగా ఉందనే కదా నన్ను కడతేర్చాలనుకున్నారు. పాపం వివేకానందరెడ్డిలా! మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2..! అంటూ రఘురామ ఘాటు రిప్లై...
ఇక్కడితో ఆగలేదు వారిద్దరి ట్విటర్ వార్. విజయసాయి మరింత రెచ్చిపోయారు.. ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరుగున్నారు.. పక్కవాళ్లకు ప్రేమబాణాలు.. ఢిల్లీలో కూర్చొని కాకమ్మ కబుర్లు.. రాళ్లతో కొడతారు.. అంటూ సాయిరెడ్డి మరింత రెచ్చగొట్టారు. అందుకు తగ్గట్టే రఘురామ సైతం రెచ్చిపోయారు. రాజ్యసభ రెన్యువల్.. ఏ1 చేతిలో తన్నులు తినడం ఖాయం అంటూ రఘురామ విజయసాయిరెడ్డికి ట్విటర్లో టిట్ ఫర్ టాట్ ఇచ్చారు. వీరిద్దరి డైలాగ్ వార్ మధ్యలో నెటిజన్లూ ఎంటరై.. విజయసాయికి మరిన్ని వాతలు పెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twitter-war-between-vijayasaireddy-and-raghurama-39-130504.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.