ఇండియాతో వివాదాన్ని కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. భారత్ రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ ను అంగీకరించడానికి ముందుకు రావడం లేదు. ఇతర సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు దిగొచ్చినా.. ట్విట్టర్ మాత్రం వాదనకు దిగుతోంది. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు షాకిచ్చింది ట్విట్టర్. వెంకయ్య నాయుడు అకౌంట్ నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్ను తొలగించింది.
అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో... ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న... VPసెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్తో కొనసాగుతోంది. "ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ని తొలగించింది." అని ANI న్యూస్ ఏజెన్సీకి... ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు. వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి గతేడాది జులై 23న చివరి ట్వీట్ వచ్చింది.
కొత్త ఐటీ రూల్స్కి సంబంధించి... గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు కేంద్రంతో డీల్ ఓకే చేసుకోగా... ట్విట్టర్ మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి అంగీకరించలేదు. కేంద్రంతో వాదనకు దిగుతోంది. ఇలాంటి సమయంలో... ఈ సంచలన పరిణామం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twitter-shock-vice-president-venkaiah-naidu-25-116947.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.