కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడి దొంగలు ముందుగా జ్యువెలరీ షాప్ పై రెక్కి నిర్వహించడమే కాకుండా పోలీసుల చేతికి చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... దొంగతనం చేసిన అనంతరం ఈ దుండగులు బైక్ను గోదావరి తీరంలో వదిలివేసి వెళ్లారు... అయితే ఇప్పుడు ఆ ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్ పై పోలీసులు ఆరా తీయడంతో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి... దుండగులు వాడిన ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్ హైదరాబాదుకు చెందినదిగా గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అనంతరం కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు... దీంతో హైదరాబాద్కు చెందిన మొబైల్ షాప్ వ్యాపారిని పోలీసులు విచారణకు పిలిపించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.. పోలీసుల విచారణలో ఆ వ్యాపారి తన TVS మోటార్ కంపెనీ తయారు చేసిన అపాచీ బైక్ను అమ్మేం దుకు ఇటీవల OLX లో ప్రకటన ఇచ్చినట్లు తెలిసింది.
అదే ప్రకటనలో ఉన్న వాహనం నెంబర్ను దుండగులు గుర్తు పెట్టుకుని, తమ బైక్కు అదే నెంబర్ ప్లేట్ అమర్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. దుండగులకు ఆ నెంబర్ ఎలా తెలిసింది? ప్రకటనను చూసి ముందుగానే ప్రణాళిక వేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twist-in-karimnagar-jewelry-shop-robbery-case-36-219152.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.