టీటీడీలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

Publish Date:Feb 5, 2025

Advertisement

జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి  అధ్వానంగా ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రక్షాళన చేసి మళ్లీ అభివృద్ధి బాట పట్టించాల్సిన పరిస్థితి. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల దేవుడిని దర్శించుకున్న చంద్రబాబు అక్కడే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభిస్తానని ప్రకటించారు. అదే చేశారు. చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన మొదలైంది. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ పనికి నడుంబిగించింది.

తిరుమలపై ఈ నెల 11 చంద్రబాబు సమీక్ష చేయనున్న నేపథ్యంలో కీలక చర్యలు, సంచలన నిర్ణయాలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ వారిపై బదిలీ వేటు వేసింది. వీరు కాకుండా మరో 300 మంది అన్యమతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో కొలువులు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. వారిని కూడా దశల వారీగా బదలీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టీటీడీ బదిలీవేటు వేసిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.  

తిరుమలలో అన్యమతస్తులు ఉండడానికి వీలులేదని టీటీడీ చెబుతోంది. హిందువులు వినా మరో మతానికి చెందిన వారికి టీటీడీలో కొలువులు సరికాదన్న భావనతో  ముందుగా టీటీడీలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో కొందరు టీటీడీలో కొలువులో చేరారు. 
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీలో హిందూయేతరులు ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నారు.  టీటీడీలో ఉద్యోగం చేస్తున్న అన్యమతస్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోకి మార్చడం లేదంటూ వీఆర్ఎస్ ఇవ్వడం చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు.  ఆ మేరకు ఆరా తీయగా టీటీడీలో 300 మందికి పైగా అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పుడు వారిని టీటీడీ నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది.

తొలి దశలో 18 మందిపై బదిలీ వేటు వేసింది.  ముందు ముందు మిగిలిన వారిని కూడా టీటీడీ నుంచి వేరే రాష్ట్రప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడమో, వీఆర్ఎస్ ఇవ్వడమో చేస్తామని టీటీడీ చెబుతోంది. ఇక తిరుమల కొండపై పారిశుదధ్య పరిస్థితిని మెరుగుపరచడానికి టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. తిరుమలలో పారిశుద్ధ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని భక్తులు చెబుతున్నారు. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలు, అన్న, జల ప్రసాదాల వితరణ భేషుగ్గా ఉందంటున్నారు. అలాగే తిరుమల కొండపై హోటళ్లలో తినుబండారాల నాణ్యత కూడా మెరుగుపడిందనీ, అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతా భేషుగ్గా ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ బ్రహ్మాండంగా నిర్వహించిందని భక్తులు ప్రశంసిస్తున్నారు. స్వామి వారి వాహన సేవలను తిలకించి తరించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.