తిరుమలలో భక్తుల వద్దకు కదిలివస్తున్న అన్నప్రసాదం.!

Publish Date:Aug 7, 2026

Advertisement

దేవుడి ప్రసాదాన్ని అందుకోవడానికి ఎక్కడైనా సరే భక్తులు వెళ్లాల్సి వస్తుంది. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం  తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం మాత్రం భక్తుల వద్దకే కదిలి వస్తున్నది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వినూత్న విధానాన్ని సాంకేతిక హంగులతో అమలులోకి తీసుకువచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. 

తిరుమలలో స్వామి వారి దర్శన భాగ్యం కోసం భక్తులు గంటల తరబడి కంపార్ట్ మెంట్లలోనూ, క్యూలైన్ లోనూ వేచి ఉంటారు. ఒక్కోసారి స్వామి వారి దర్శనానికి పట్టే సమయం 24 గంటలకు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వారాంతం, పండుగలు పర్వదినాలలో అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడిపోతాయి. భక్త జన సంద్రాన్ని తలపిస్తాయి.   ఎంతటి భక్తజన ప్రవాహం వచ్చినా వారి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించి   టీటీడీ, భక్తులకు అన్నప్రసాదాలను ఎలాంటి జాగు లేకుండా సులభంగా అందించడానికి మరియు సులభతరంగా చేయడానికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

 టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇంజినీరింగ్,  క్యాటరింగ్ విభాగాల అధికారులతో సమగ్రంగా చర్చించి ఈ వినూత్న ప్రాజెక్టుకు రూపునిచ్చారు. క్యూలైన్లలో శ్రీవారి సేవకులు నడుస్తూ ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా రద్దీ సమయంలో తరచూ తోపులాటలు జరగడం, భక్తులకు సమయానికి ప్రసాదం అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండేవి. వీటిని నివారించడానికి ఇంజినీరింగ్ విభాగం దాదాపు పది లక్షల  వ్యయంతో ఏడు మీటర్ల పొడవు కలిగిన ఒక మూవింగ్ టేబుల్‌ను  రూపొందించింది. ఈ టేబుల్ ఒక కన్వేయర్ బెల్టు తరహాలో చుట్టూ నిరంతరం కదులుతూ ఉంటుంది.

ఈ సాంకేతిక వ్యవస్థ పనిచేసే విధానం చాలా సరళంగా,  సమర్థవంతంగా ఉంటుంది. కదిలే ఈ బెల్టుపై శ్రీవారి సేవకులు వేడివేడి అన్నప్రసాదాల ప్లేట్లను వరుసగా ఉంచుతారు. క్యూలైన్లలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు తమ ప్రయాణాన్ని ఆపకుండానే, పక్కనే కదులుతున్న టేబుల్ పైనుంచి సులభంగా తమకు కావాల్సిన ప్రసాదం ప్లేటును అందుకోవచ్చు. ప్లేటును భక్తులు తీసుకోగానే ఖాళీ అయిన ఆ ప్రదేశంలో సేవకులు వెంటనే మరొక  అన్నప్రసాదం ప్లేటును ఉంచుతారు. దీనివల్ల భక్తులు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా, రద్దీ నిరంతరం కదులుతూనే అన్నప్రసాదం పొందేందుకు మార్గం సుగమమైంది.

ఈ ప్రయోగాత్మక మూవింగ్ టేబుల్‌ పనితీరుపై   తిరుమలలోని రింగ్ రోడ్డు వద్ద టీటీడీ అధికారులు   ట్రయల్ రన్ నిర్వహించారు.  అక్కడ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. భక్తులు,  శ్రీవారి సేవకుల నుంచి విశేష స్పందన లభించింది.    భవిష్యత్తులో తిరుమలలోని ప్రధాన క్యూలైన్ మార్గాలన్నింటిలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రణాళికలు వేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 తో పాటు నారాయణగిరి షెడ్లు,  ఇతర కీలక క్యూలైన్ మార్గాల్లో మొత్తం సుమారు 10 కదిలే మూవింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయనుంది.  

TTD moving dining conveyor, Tirumala prasadam conveyor belt, TTD Vaikuntam queue complex, Tirupati news today, Tirumala devotees facilities, TTD food conveyor belt

By
en-us Political News

  
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
నెలకు రూ.1.5 లక్షల జీతం అని చెప్పి.. బీర్ షాప్ ఓనర్‌కు అమ్మేశారు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.