తిరుమల కొండపై కూడా రాజకీయాలు మాట్లాడటం అవసరమా?

Publish Date:Jul 16, 2014

Advertisement

 

సాధారణంగా ప్రజలు కేవలం దైవదర్శనం కోసమే అనేక వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు వెళుతుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం దైవదర్శనంతో బాటు అలవాటులో పొరపాటుగా అక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటారు. మీడియావాళ్ళను చూడగానే తామొక పరమ పవిత్రమయిన పుణ్యక్షేత్రంలో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోయి తమ రాజకీయ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుంటారు. ఆధ్యాత్మిక అంశాలతో ఎటువంటి సంబంధమూ లేని మాటలు, ప్రకటనలు, వ్యాక్యాలు, విమర్శలు చేస్తుంటారు. కేవలం గోవింద నామస్వరం ప్రతిధ్వనించాల్సిన పవిత్రమయిన తిరుమల కొండపై రాజకీయ నేతలు ఈవిధంగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేయడం చాలా అవివేకం, అసంబద్దం, అపచారం కూడా. అసలు వారు దైవదర్శనానికి ఎందుకు వచ్చారో గ్రహించినట్లయితే ఆవిధంగా మాట్లాడరు.

 

తిరుమల వచ్చే ప్రతీ రాజకీయ నాయకుడు, దైవదర్శనం వల్ల కలిగిన పుణ్యాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసి అక్కడే తుడిచిపెట్టుకొని కొండదిగి వస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ తారలు తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటమే కాదు వారి రాక వల్ల సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా అంతులేదు. ఒక్క రాజకీయ నేత దైవ దర్శనానికి వచ్చినట్లయితే, యావత్ టీటీడీ అధికారులు, చివరికి గుళ్ళో పూజారులు సైతం సామాన్య భక్తులను, దేవుడిని కూడా గాలికొదిలి పెట్టి సదరు నేతలు, తారల సేవకు అంకితమయిపోతారు. జనాలు నవ్వితే నవ్వి పోదురు గాక... ఈసడించుకొంటే ఈసడించుకొందురు గాక మాకేల సిగ్గు ఎగ్గు... అన్నట్లు వ్యవహరిస్తారు నేతలు, టీటీడీ అధికారులు.

 

మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తిరుమల దేవుని దర్శనానికి వచ్చే స్వామీజీలు, పీటాదిపతులు, బాబాలు కూడా తమకు రాచమర్యాదలు జరగాలని కోరుకోవడం, అలకలు పూనడం, మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం. సర్వసంఘ పరిత్యాగులమని చెప్పుకొనే వారు భౌతిక వాంఛలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకపోగా వారు కూడా రాజకీయ నాయకులలాగే వ్యవహరిస్తుంటారు. దైవ సన్నిధిలో అందరూ సమానమే అనే భావన వారిలో ఏ కోశాన్న కనబడదు. నిజం చెప్పాలంటే ఆ దేవునికంటే తామే మిన్న అన్నట్లు, తాము ఆ దేవుని కొలవడానికి రావడం ఆ దేవుని అదృష్టం అన్నట్లు ఉంటుంది వారి వ్యవహార శైలి. వారు కూడా తమకు వీవీఐపీ ట్రీట్ మెంటు, సకల సౌకర్యాలు కల్పించాలని లేకపోతే అక్కడే ధర్నాలు కూడా చేస్తుంటారు.

 

బహుశః ఇటువంటి దురలవాట్లు మరే ఇతర మతస్తుల పుణ్యక్షేత్రాలలో కనబడదు. కేవలం హిందూ పుణ్య క్షేత్రాలలో అదీ సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చే తిరుమలలోనే ఎక్కువగా కనబడుతుంది. తిరుమల కొండపై ఈవిధంగా నేతలు, సినీ తారలు మీడియాతో మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం చాల సహజ విషయమన్నట్లు ప్రజలు, ప్రభుత్వాలు, మీడియా చివరికి టీటీడీ కూడా భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

నిన్న తిరుమల శ్రీవారి దర్శినం కోసం వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆ పనేదో ఆయన కొండ క్రిందకు దిగివచ్చి చేసి ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరమూ ఉండేది కాదు. ఇది ఆయనొక్కరికే కాదు, తిరుమల కొండపై అడుగుపెట్టే ప్రతీ రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. పరమ పవిత్రమయిన దైవ కార్యంలో నిమగ్నమవ్వాల్సిన టీటీడీ బోర్డులో అనేక నేరాలు, సారా వ్యాపారాలు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టడమే ఈ అనర్దాలన్నిటికీ మూలకారణం. తిరుమల పవిత్రత, ఆచార వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేని నేతలు, ఆధ్యాత్మికత, మానవసేవ, దైవార్చన, నియమ నిష్టల పట్ల ఏమాత్రం ఆసక్తిలేని వారికి ఇటువంటి బాధ్యతలు అప్పగిస్తునంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు ఉండదు.

 

ఇప్పటికయినా ప్రభుత్వం తిరుమల పవిత్రతను, గొప్పదనాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకొని, అందుకు అర్హులయిన వారి చేతుల్లోనే టీటీడీని పెట్టాలి. కొండపై జరుగుతున్న ఈ అపచారాలను అరికట్టే ప్రయత్నాలు చేయాలి. తిరుమలలో తొలి ప్రాధాన్యత ఆ ఏడుకొండల వాడికే తప్ప నేతలు, స్వామీజీలకు కాదు. ఆ తరువాత ప్రాధాన్యం ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి ఎంతో భక్తితో వస్తున్న సామన్యభక్తులకే తప్ప నేతలకు పీటాధిపతులకు కాదనే సంగతి టీటీడీ కూడా గ్రహిస్తే బాగుంటుంది.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.