డాలర్ కాయిన్ పై ట్రంప్ ముఖం.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద  నేతగా గుర్తింపు పొందిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి  వార్తల్లో నిలిచారు. తనదైన శైలి నిర్ణయాలతో  నిత్యం చర్చల్లో ఉండే ట్రంప్..  తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు.  అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని..  ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన  ఫస్ట్ లుక్  సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో   హల్ చల్ చేస్తోంది.  

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం  యునైటెడ్ స్టేట్స్ మింట్   1 డాలర్  విలువైన గోల్డ్ కాయిన్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నాణెంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రం స్పష్టంగా ముద్రించబడి ఉంది. దేశానికి సంబంధించిన కీలకమైన స్వాతంత్ర్య వారసత్వాన్ని, దేశభక్తిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికా విలువలను, దేశ బలాన్ని చాటిచెప్పడంతో పాటు ప్రజలందరికీ స్వేచ్ఛను రక్షించేలా దేశం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ నాణెం ఇస్తుందని యూఎస్ సెక్రటరీ బెస్సెంట్  పేర్కొన్నారు. 

  అమెరికా చరిత్రలోనే ఒక అధ్యక్షుడు అధికారంలో ఉంటూ, జీవించి ఉన్న సమయంలోనే దేశ అధికారిక కరెన్సీపై ఆయన చిత్రం ముద్రించబడటం ఇదే తొలిసారి. సాధారణంగా దేశాల కరెన్సీ నోట్లు లేదా నాణేలపై చారిత్రక పురుషులు, దివంగత నేతల చిత్రాలను ముద్రించడం ఆనవాయితీయే.   కానీ ట్రంప్ విషయంలో ఈ సంప్రదాయానికి భిన్నంగా, ఆయన సజీవంగా ఉండగానే యూఎస్ కరెన్సీపై స్థానం సంపాదించడం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. తనను తాను ఒక అసాధారణమైన లార్జర్-దెన్-లైఫ్ వ్యక్తిత్వంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడే ట్రంప్ శైలికి ఇది నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ సరికొత్త  డాలర్ గోల్డ్ నాణెం మార్కెట్లోకి విడుదలైన తర్వాత అమెరికా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Donald Trump Gold Coin, US Mint 1 Dollar Coin, US 250 Years Independence, America President Trump Currency

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.