ట్రంప్ దూకుడు.. ప్రమాదంలో అమెరికా అగ్రరాజ్య హోదా?!

Publish Date:Jan 29, 2025

Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జన్మతహ పౌరసత్వం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, హెచ్1బి వీసాల విషయంలో అమలు చేస్తున్న ఆంక్షలు కానీ, ఇంకెంత మాత్రం ఇతర దేశాల నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వద్దామనుకునే వాళ్లను ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులు ఆదాయపన్ను చెల్లించనవసరం లేదనీ, వారి ఆదాయపన్ను రద్దు చేస్తున్నాననీ ప్రకటించారు. అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గమే.. ఇతర దేశాలు అనివార్యంగా అమెరికాకు దూరం జరగక తప్పని పరిస్థితిలోకి వాటిని నెట్టేస్తున్నది. ఇంతకీ ఆ అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేసి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటంటే ఇతర దేశాలపై భారీగా సుంకం వసూలు చేయాలని.  అమెరికా అలా అధిక సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకున్న దేశాలలో ప్రధానంగా చైనా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి. 

భారత్ పట్ల ఆయన అక్కసు గతం నుంచీ తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి ఇంకా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే ట్రంప్  భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. అమెరికా దిగుమతులపై భారత్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందంటూ ఆయన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.   విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేయడం ద్వారా అమెరికా దేశస్థులను సంపన్నులుగా చేయడమే తన లక్ష్యంగా ట్రంప్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు.   ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయులు తీవ్రంగా నష్టపోతారు.  విదేశీయులపై కూడా సుంకం పెంచడమంటే అమెరికా లోని ఎన్నారైలు కూడా రిస్కు లో పడినట్లే. 

ఇక ట్రంప్ నిర్ణయాలు చదువు కోసం అమెరికా వెళ్లిన, వెళ్లాలనకుంటున్న భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేస్తే తమను అక్రమ వలసదారులంటూ దేశం నుంచి పంపించేస్తారని భయపడుతున్నారు.  చదువుకోసం వెళ్లినవారు చదువు పూర్తికాగానే స్వదేశా లకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ లు చేయడం నిబంధనలకు వ్యతిరేకమంటూ వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక యూరోపియన్ దేశాలపైనా ట్రంప్ తన ప్రతాపం చూపుతున్నారు. డాలర్ ను కాదని యూరో కరెన్సీ అనే దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇక చైనాకు అయితే గట్టి ఝలకే ఇచ్చారు.   ట్రంప్ దూకుడు అమెరికాకు మేలు చేస్తుందా? నష్టం చేకూరుస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ నిర్వాకం వల్ల తొందరలోనే అమెరికా అగ్రరాజ్యం హోదా కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.