ట్రంప్ దూకుడు.. ప్రమాదంలో అమెరికా అగ్రరాజ్య హోదా?!

Publish Date:Jan 29, 2025

Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జన్మతహ పౌరసత్వం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, హెచ్1బి వీసాల విషయంలో అమలు చేస్తున్న ఆంక్షలు కానీ, ఇంకెంత మాత్రం ఇతర దేశాల నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వద్దామనుకునే వాళ్లను ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులు ఆదాయపన్ను చెల్లించనవసరం లేదనీ, వారి ఆదాయపన్ను రద్దు చేస్తున్నాననీ ప్రకటించారు. అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గమే.. ఇతర దేశాలు అనివార్యంగా అమెరికాకు దూరం జరగక తప్పని పరిస్థితిలోకి వాటిని నెట్టేస్తున్నది. ఇంతకీ ఆ అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేసి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయమేంటంటే ఇతర దేశాలపై భారీగా సుంకం వసూలు చేయాలని.  అమెరికా అలా అధిక సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకున్న దేశాలలో ప్రధానంగా చైనా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి. 

భారత్ పట్ల ఆయన అక్కసు గతం నుంచీ తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి ఇంకా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే ట్రంప్  భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. అమెరికా దిగుమతులపై భారత్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందంటూ ఆయన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.   విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు చేయడం ద్వారా అమెరికా దేశస్థులను సంపన్నులుగా చేయడమే తన లక్ష్యంగా ట్రంప్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇందు కోసం ఆయన ఎక్స్ టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు.   ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్ ను లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయులు తీవ్రంగా నష్టపోతారు.  విదేశీయులపై కూడా సుంకం పెంచడమంటే అమెరికా లోని ఎన్నారైలు కూడా రిస్కు లో పడినట్లే. 

ఇక ట్రంప్ నిర్ణయాలు చదువు కోసం అమెరికా వెళ్లిన, వెళ్లాలనకుంటున్న భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే చదువుకోవడానికి అమెరికా వెళ్లిన భారతీయులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేస్తే తమను అక్రమ వలసదారులంటూ దేశం నుంచి పంపించేస్తారని భయపడుతున్నారు.  చదువుకోసం వెళ్లినవారు చదువు పూర్తికాగానే స్వదేశా లకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ లు చేయడం నిబంధనలకు వ్యతిరేకమంటూ వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక యూరోపియన్ దేశాలపైనా ట్రంప్ తన ప్రతాపం చూపుతున్నారు. డాలర్ ను కాదని యూరో కరెన్సీ అనే దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇక చైనాకు అయితే గట్టి ఝలకే ఇచ్చారు.   ట్రంప్ దూకుడు అమెరికాకు మేలు చేస్తుందా? నష్టం చేకూరుస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ నిర్వాకం వల్ల తొందరలోనే అమెరికా అగ్రరాజ్యం హోదా కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎస్ సి ఎస్ టి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరో వైపు వంశీ కూడా తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్ కు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది.  అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి  కోర్టుకు వచ్చారు. 
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సరెండర్ అయ్యారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు  ఉన్నారు. వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు సోమవారం  గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలు సోమవారం (ఫిబ్రవరి 17) అగ్నిప్రమాదం సంభవించింది. కుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడో సారి.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు.
వంశీ కనుసన్నలలోనే టీడీపీ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది.
జెఎన్జె హౌసింగ్ సొసైటీకి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాగ్రెస్ పార్టీ టీమ్ జేఎన్‌జేకు సంపూర్ణ‌ మ‌ద్ద‌తునిస్తోంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు బి.మ‌హేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అనే ఉత్కంఠం నెలకొంది. ఢిల్లీ సిఎం రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిని ఓడించిన పర్వేశ్  వర్మ ఈ పేరు ప్రముఖం వినిపిస్తుంది.
కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు అంటే నెల రోజుల కిందటి వరకూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కేసులో కేటీఆర్ నిండా ఇరుక్కున్నారనీ, ఇహనో ఇప్పుడో ఆయన అరెస్టు ఖాయమని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, ఏసీబీ కూడా ఆయనను విచారించాయి. కోర్టు కూడా ఆయనకు అరెస్టు నుంచి పూర్తి రక్షణ కల్పించలేదు. ఈ కేసులో ఈడీ విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇరువురు కేటీఆర్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పీఏను అరెస్టు చేశారు. హరీష్ రావు పిఏ వంశీకృష్ణను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 15) అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మరి కొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజ్ణాన విహార యాత్రలను పంపాలని నిర్ణయించింది. మనోవికాసం, స్కిల్ డెవలప్ మెంట్, సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించడం కోసం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను విజ్ణాన, విహార యాత్రలకు పంపాలన్న నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.