అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం (నవంబర్ 5) జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ ఎన్నికలలో 24.5 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూడా ఈ ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందన్న విషయంలో ఇతమిథ్ధంగా చెప్పలేకపోయాయి. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్వింగ్ స్టేట్స్ లో కూడా స్వింగ్ కమలా హారిస్, ట్రంప్ లలో ఎవరివైపు ఉందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎన్నికల ప్రారంభానికి ముందు, అంటే చివరి క్షణంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు ఓటర్లను ఉద్దేశించి వేర్వేరుగా పెట్టిన పోస్టులలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
డెమెక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై విజయం సాధించడం ఖాయమంటూ తన పోస్టులో పేర్కొన్న జోబైడెన్.. అందుకు మీరంతా ఓటు వేయాలని కోరారు. ముందుస్తు ఓటు వేయని ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇక డోనాల్డ్ ట్రంప్ అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుకుందామని, అందు కోసం మీరంతా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుంది. ఆమె మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాంతిని పునరుద్ధరించడం కోసం తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-and-biden-social-media-campaign-25-187884.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!