చివరికి మిగిలేది?

Publish Date:Feb 23, 2022

Advertisement

బాలాస్తావతీ క్రీడాసక్తః 
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః 

భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!

వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః 

భావం: వయస్సు మళ్ళిపోతే కా మవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.  భజ గోవిందం లోని ఈ రెండు శ్లోకాలు నాకు కాలగమనము యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తూ ఉంటాయి. నిజమే కదా ఈ వయస్సు అన్నది శాశ్వతం కాదు. బాల్య వయసులో మనం ఆటల్లో గడిపేస్తాం. కొద్దిగా యవ్వనం లోకి రాగానే మన మనసుకు నచ్చిన వారితో సంసార సాగరంలో పడిపోతాము. మళ్లీ ముసలి వయసు రాగానే ఈ జబ్బులు ఆ జబ్బులతో ఒళ్లంతా రోగాలు మయం చేసుకుని, మనకు పాడి కట్టే రోజు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంటాము.

ఇదేనా జీవితం అంటే? నాకైతే ఇంతకుమించి ఏదో ఉంది అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న చివరికి చేరాల్సింది ఈ మట్టిలోనే. ఈ మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఎన్నో మారణహోమాలు, ఎన్నో దుర్మార్గాలు, మరెన్నో అవినీతి కార్యాలలో, చేతకాని వారిగా భాగస్వాములమవుతాం లేదా అటువంటి వారిని చూస్తూ చేతలుడిగి కూర్చుంటాము.

నిజానికి చివరికి మిగిలేది అనేది మనం ఎవరము ఆలోచించము కదా. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి చావు అనేదే లేనట్టు బతుకుతాడు కానీ ఎన్నడూ బతక లేనట్టు చస్తాడు. ఇది నిజం కాదంటారా?
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మనకు సమయం ఉండగానే మనం మనతోపాటు చివరి క్షణాల్లో మనకు అండగా వచ్చే వాటిని తీసుకుపోవాలి మరి మనకు అండగా వచ్చేదేంటి? ధర్మరాజుకున్నంత ధర్మాన్ని మనం పాటించలేము. ఈ కాలంలో అది అసలు కుదరని పని. కానీ కొంతలో కొంతైనా మనం ధర్మం పక్షాన నిలబడలేమా? చివరికి మనతోపాటు కొన్ని ఆత్మీయ అనుభూతులను మోసుకెళ్లలేమా? 

మన ఊపిరి వదిలే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఆస్వాదిస్తూ, మనతోపాటు పయనం చేస్తున్న సమస్త జీవరాశిని ప్రేమిస్తూ సాధ్యమైనంతలో సేవ చేస్తూ, బతికితే అదే చాలు ఈ జీవితానికి. ఏముందిలే ఇంకా నాకు బోలెడంత వయసు ఉంది. తీర్ధయాత్రలవీ చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించేసుకుంటాను అనే భ్రమను వదిలి ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నట్టు బతుకు నావను ఈశ్వరునికి అంకితం చేసేద్దాం.
మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే కళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ వీడు పోయి భూమికి భారం తగ్గింది అనుకుని నవ్వే పెదవులు ఉండకూడదు.

వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.