Publish Date:Jul 26, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి, ఓ ఎమ్మెల్యే ఘర్ణణ పడ్డారు. సభ వేదికపైనే కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఒకరికొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్న నేతలు.. మైకులు లాగేసుకున్నారు. కొట్టుకునే వరకు వెళ్లారు. పోలీసులు, రెండు పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకోని ఇద్దరిని వేరు చేయడంతో పక్కక జరిగారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే మంత్రి అభివృద్ది కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు.
జగదీశ్ రెడ్డి ముందే రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతలో కలగజేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. కోమటిరెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడొద్దంటూ మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. అటు కోమటిరెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటరిస్తూ మంత్రిపై దూషణలకు దిగారు. అంతేకాదు మంత్రి చేతిలోని మైకును లాక్కొవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరు తోపులాడుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అదే సమయంలో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వేదిక వైపుకు దూసుకువచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులతో పాటు ఇతర నేతలు మంత్రి, ఎమ్మెల్యేను వారించి కూల్ చేశారు.
సభను బయటికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమలకు ఎమ్మెల్యే కు సమాచారం లేకుండా మంత్రి వచ్చిపోవడం ఎమ్మెల్యే లను అవమానపరచడమే అన్నారు. మంత్రిగా ఉంటే నియోజక వర్గంలో ఒక్క చోట ప్రారంభించి మిగతా కార్యక్రమాలను ఎమ్మెల్యే కి వదిలెయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు.. సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే.. సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని లేకపోతే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఇలాగే ఉంటుంది అని సవాల్ చేశారు. శివన్నగూడ, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులకు కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని.. దమ్ముంటే ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-minister-cong-mla-fight-in-meeting-25-120376.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,