తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలు తీసుకొచ్చినా పని చేయలేదు. కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు హుజురాబాద్ ఓటర్లు. హుజురాబాద్ ఫలితం తర్వాత మరో అంశం అసక్తికరంగా మారింది. నవంబర్ నెల సీఎం కేసీఆర్ కు అచ్చిరావడం లేదనే చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇప్పటివరకు 8 ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఆరింటిలో టీఆర్ఎస్ గెలవగా.. రెండు చోట్ల మాత్రమే ఓడింది.అవి మెదక్ జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజురాబాద్. అయితే ఈ రెండు ఎన్నికల ఫలితం నవంబర్ లోనే వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు నవంబర్ నెల గండం అనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీకి 2020 నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికను టీఆర్ఎస్ సవాల్ గా తీసుకుంది. మంత్రి హరీష్ రావే ఇంచార్జీగా ఉన్నారు. హుజురాబాద్ తరహాలోనే పోరాడారు. అయినా ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి సంచలనం స్పష్టించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.
తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ లోనే వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత హీట్ పుట్టించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిస్తూ ఘన విజయం సాధించారు ఈటల రాజేందర్. దీంతో నవంబర్ మాసం కేసీఆర్ గండం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో ముందున్నవారే. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే కావడం మరింత ఆసక్తికరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-facing-november-tention-25-125748.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు