Publish Date:Aug 28, 2022
ఒకాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మార్కెట్కి రావడం లేదే అని అడిగాడు. ఎందు కు డబ్బు దండగన్నా డు ఆ స్నేహితుడు. అన్నీ రాజకీయపార్టీ వారే ఇస్తామన్నపుడు మళ్లీ కొనడం దేనికన్నా డు. మొన్ననే గోడ గడి యారం ఒకటి కొనాల నుకునాను.మరుక్షణం ఒకాయనొచ్చి ఏ బ్రాండ్ కావాలో అడిగి మరీ కొనిచ్చి వెళ్లాడు. నిన్న భారీ వర్షంపడింది. ఇంట్లో గొడుగుల్లేవు ఎలా బయటకి వెళ్లాలా అనుకున్నాననా, పొద్దున్నే ఒకాయన సీఎం బొమ్మతో ఉన్న గొడుగులు రెండిచ్చి సమస్యతీర్చి వెళ్లాడు. రేపె వరన్నా వచ్చి ఫ్లాస్కో, ఫ్రిజ్జో ఇచ్చేస్తే బావుణ్ను అనుకున్నాడు. ఫ్రిజ్ సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీల తీరుతెన్నులు ఇలా మారిపోయాయన్నది ఆ పెద్దాయన చూచాయిగా చెప్పాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమం గా అమలుచేసి వారి మేలు కోరితే అంతకంటే మరేమీ అక్కర్లేదనుకునే ఓటర్లకు ఇలాంటి కానుకలతో బద్ధకాన్ని పెంచి పోషిస్తు న్నారన్న ఆరోపణలు బాగానే ఉన్నాయి.
అసలే ఉచితాలతో ప్రజల్ని బాగా ఆకట్టుకోవడం అలవాటుగా చేసుకున్న పార్టీలు ఇపుడు ఈ చిరు కానుకలతోనూ కట్టిపడే స్తున్నారు. చిత్రమేమంటే, ఎన్నికల సమయంలోనే పాపం బీద ఓటర్లంతా ఒక్కసారిగా రాజకీయనాయకుల కలల్లో కనపడ తారు. వీరికి ఎవరూ ఏమీ ఇవ్వలేకపోతే ఎలా? అనే చింతనా వ్యధతో తెల్లారగానే గడియారాలు, గొడుగులు, ఇస్త్రీపెట్టెలు వంటి వాటితో వీధుల్లో, చిన్నగల్లీలోనూ సమావేశాలు పెట్టి మరీ గొప్ప సత్కారం చేసినట్టు ఇవ్వడం పరిపాటి అయింది. ఎన్నికల రోజు ప్రత్యేక బళ్లు ఏర్పాటు చేయడం, ఇళ్లకి వెళ్లి ఓటర్లను చక్కగా పలకరించడం, వీలైతే కుంకుమ భరిణతో సహా సతీ సమేతంగా వెళ్లి పలకరించడం ఆనవాయితీగా చేసుకున్నారు. ఇదో గొప్ప ఆకర్ష్ కళ. ఇదింకా పాపం బీజేపీవారికి తెలియలేదు.
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపర్వం మాత్రం జోరుగా కొనసాగుతోంది. నిన్నటి దాకా గోడ గడియారాలు పంచిన టీఆర్ఎస్ నేతలు తాజాగా గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒకటి రెండు చోట్ల ఓటర్లు గోడ గడియారాలను తిరస్కరించినా ప్రలోభాలను మాత్రం ఆపడం లేదు.
తాజాగా సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటో, పార్టీ కారు గుర్తు ముద్రించిన గొడుగులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీతో పాటు మండలవ్యాప్తంగా శనివారం రాత్రి పంచారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఓటర్లు అనుకున్న వారితోపాటు తటస్థులకు కూడా గొడుగు లు పంపిణీ చేశారు. అధికార పార్టీ తన గుర్తును విస్తృతంగా మునుగోడు ఓటర్లకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే రోజువారీగా ఉపయోగించే వస్తువులను ప్రలోభాలకు అస్త్రంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గొడుగు టెక్నిక్ మరి ఓట్లను ఏ మేరకు వేయిస్తుందనేది చూడాలి. వర్షాలు, ఎండల రాకపోకలు తెలియని ఈ రోజుల్లో గొడుగులు ఇచ్చి తమ ప్రత్యేకతనీ టీఆర్ ఎస్ చాటుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs--umbrella-25-142806.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.