కేసీఆర్… బీజేపీని టార్గెట్ చేయలేదా? చేసే అవసరం లేదనుకున్నారా?

Publish Date:Apr 28, 2017

Advertisement

 

వరంగల్ టీఆర్ఎస్ చేసిన జన సమీకరణ వరదలో మునిగి తేలింది. ఎప్పటిలాగే గులాబీ పార్టీ సత్తాకి ఓరుగల్లు హోరుగల్లుగా మారిపోయి సాక్ష్యంగా నిలిచింది. ఇక కేసీఆర్ మార్క్ ఉపన్యాసంతో ప్రగతి నివేదన సభ సంబురం చేసుకుంది. గులాబీ కార్యకర్తల చేతులు చప్పట్లు కొట్టీ కొట్టీ గులాబీ రంగులోకే మారాయి! కానీ… కానీ… మూడేళ్లు పూర్తి చేసుకున్న తొలి తెలంగాణ సర్కార్ … అసలింత పెద్ద సభకు ఎందుకు పూనుకుంది? ఈ ప్రశ్నలోనే ప్రగతి నివేదనకు బోలెడు కారణాలు కనిపిస్తాయి!

 

కేసీఆర్ వరంగల్ సభలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం మాత్రమే ఏకరువు పెట్టలేదు. ప్రతిపక్షాల దుమ్ము దులిపారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ కు చెడామడా చీవాట్లు పెట్టారు. పూర్తి స్థాయిలో చవటలు,సన్నాసులు వంటి పదాలు వాడుతూ గులాబీ బాస్ తనదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చారు. దీనికంతటికి కారణం ఒక్కటే ఒక్కటి! అయిదేళ్ల కాలంలో ఇప్పుడు సగానికి సగం పూర్తైపోయింది. జనంలోనూ 2014లో వున్న మూడ్ ఇప్పుడు లేదు. అప్పుడున్న ఎమోషన్ కూడా క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు ఆంధ్రా అన్న అస్త్రం ముందులా కేసీఆర్ వాడలేకపోతున్నారు. ఆంద్రా పాలకులు, ఆంధ్రా దోపిడీ లాంటి ఆల్ టైం ఫేవరెట్ పదాలు గతంలో జనం పై పని చేసేవి. కాని, ఇప్పుడు అన్నిటికి, అంతటికీ తెలంగాణ సర్కార్ దే బాద్యత. వచ్చే ఎన్నికల్లో అదే ప్రధానం కానుంది. అందుకే, ప్రగతి నివేదన సభ అవసరమైంది!

 

ప్రగతి భవన్ భారీ ఖర్చుతో సిద్ధం చేయించిన కేసీఆర్ అదే దూకుడు ప్రగతి సాధించటం విషయంలో చూపలేకపోతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, చేపలు ఇస్తామంటున్నారని జనం పుర్రెల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తనకు వీలైనంత ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత పెంచటానికి! అదే సమయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక విషయాల్లో వెనుకబడుతోంది. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం మొదలు దళితులకి మూడెకరాల భూమి వరకూ అన్ని హామీలు, ప్రకటనలు అర్ధాంతర స్థితిలో వుండిపోతున్నాయి. అమలు చేయగలిగేవి , చేయలేనివి అన్నీ త్రిశంకు స్వర్గంలో వుంటున్నాయి. మరో వైపు నుంచీ పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల నుంచీ కూడా రెడ్ సిగ్నల్స్ వస్తున్నాయి. జనంలో ఆ విషయంలో కూడా వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు!

 

మైనార్టీ రిజర్వేషన్లు, గవర్నమెంట్ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు… ఇలా ఎన్నికలకు ముందే చెప్పినవీ, గొర్రెల పంపిణీ, ఎరువుల పంపిణీ వంటి ముందుగా చెప్పనివీ… అన్నీ ప్రస్తుతానికైతే ఆదికి, అంతానికి మధ్యలో వున్నాయి. ఒకవేళ మోదీ చెబుతున్నట్టు వచ్చే సంవత్సరం చివర్లోనే ఎన్నికలు వచ్చేస్తే వీటిల్లో చాలా హామీలు జనానికి ప్రతిఫలాల రూపంలో అందకపోవచ్చు. అంతలోపే త్వరత్వరగా అమలు పూర్తి చేసి పబ్లిక్ రిజల్ట్ చూపాలి. లేదంటే వాళ్లకు మరో ఆలోచన వచ్చే ఛాన్స్ వుంది. అందుకే, కేసీఆర్ మరోసారి జనానికి భరోసా కల్పించేందుకు వరంగల్ సభ నిర్వహించారు. కాని, ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఒక్క విషయంలో ఆశ్చర్యపరిచింది!

 

కేసీఆర్ ఎప్పటిలాగే కాంగ్రెస్ ను బలంగా టార్గెట్ చేశారు. టీ టీడీపీని కూడా ఘాటుగానే విమర్శించారు. కాని, అంతా భావించినట్టుగా బీజేపిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఢిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నా కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు? ఒక కారణం, కమలదళం అమాంతం ఎదిగిపోవటం తెలంగాణలో సాధ్యం కాదు కాబట్టీ…. లైట్ తీసుకోవచ్చు. రెండోది, అనవసరంగా బీజేపిని టార్గెట్ చేస్తే అవసరం లేని ప్రాముఖ్యత ఏర్పడి కాషాయ నాయకులకి ఉపయోగపడవచ్చు! ఈ రెండు కోణాల్లో ఆలోచించి కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయకపోవచ్చు. ఇక మూడోది … కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో ఇప్పట్నుంచే పోరాటం మొదలు పెడితే నిధుల రాబట్టుకోవటం కూడా కష్టమని సీఎం భావించి వుండవచ్చు! ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రస్సే తప్ప బీజేపీ కాదని చెప్పకనే చెప్పారు కేసీఆర్!

 

ముందు ముందు అమిత్ షా వ్యూహాలు ఫలించి బీజేపీలోకి భారీగా వలసలు మొదలైతే టీఆర్ఎస్ మాట తీరు కూడా మారవచ్చు. అంతే తప్ప సాధారణ పరిస్థితుల్లో గులాబీకీ, కమలానికి పెద్దగా పోరాటం జరిగే సూచనలు ఇప్పుడైతే కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరి మధ్యా మైత్రీ మొలకెత్తి టీఆర్ఎస్ ఎన్డీఏలో భాగమైనా ఆశ్చర్యమూ లేదు! ఎందుకంటే, ఒకవైపు రాష్ట్ర బిజేపి నేతలు వ్యతిరేకించిన ఉచిత ఎరువు పథకాన్ని మోదీ మెచ్చుకున్నారట! ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారట! ఇలాంటి సంకేతాలు కొంత మేర భవిష్యత్ ను సూచిస్తన్నాయి….

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.