మద్యం కుంభకోణం జగన్ కు బిగుస్తున్న ఉచ్చు!?

Publish Date:Jun 13, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఈ తుఫాను రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, శరవేగంగా అరెస్టుల పర్వం వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.   ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే  విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  విశ్లేషించారు. సాధారణంగా లోకల్ పోలీసులు లేదా సిట్ చేసే విచారణకు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేసే పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కేసుపై సుమారు నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేసి, 33 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ ముగిసిందని సిట్ ప్రకటించినప్పటికీ..  అక్కడితో కథ ఆగిలేదు. ఆ నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కొత్తగా ఈసీఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ఒకరిని అరెస్ట్ చేసిందంటేనే 80 శాతం కేసు నిర్ధారణ అయినట్లేనని రామకృష్ణ అన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తుందని వివరించారు.

ఈ కుంభకోణం తాలూకు ఆర్థిక మూలాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్య ఒక మద్యం కార్టన్ రవాణా చేయడానికి కాంట్రాక్ట్ ధర 13 రూపాయలుగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే..  మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. కేవలం రవాణా చార్జీలనే ఏకపక్షంగా 13 రూపాయల నుండి  32 రూపాయలకు పెంచేశారు. అంటే ప్రతి కార్టన్‌పై 21 రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ రవాణా గోల్‌మాల్ వల్లే ప్రభుత్వ ఖజానాకు సుమారు 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ, సిట్ ప్రాథమికంగా లెక్క తేల్చాయి. అయితే ఇది కేవలం  పిల్ల స్కామ్  మాత్రమేనని, అసలు  పెద్ద స్కామ్ అయిన మొత్తం మద్యం కుంభకోణం విలువ సుమారు 3500 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అంటున్నారు.  బలంగా ఆరోపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్‌లో కేవలం ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  సిట్ దాఖలు చేసిన రెండవ చార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఐదు నుండి ఏడు సార్లు   ప్రస్తావించారు. అక్రమంగా ఆర్జించిన ఈ 3500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో దాదాపు 70 శాతం మేర తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని, ఆయనే దీనికి అంతిమ లబ్దిదారు,  అంతిమ దోపిడీదారు అని కేసులోని కొందరు ముద్దాయిలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు కూడా ఈ 33 మంది జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌తో పాటు దాదాపు 15 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముద్దాయిలుగా ఉన్న కొందరు అధికారులు అప్రూవర్లుగా మారి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను ప్రస్తావిస్తూ..   మాజీ జడ్జి రామకృష్ణ   నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2029లో కాకుండా, ముందస్తు వ్యూహంలో భాగంగా 2028 చివరిలోనే, అంటే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే కాదు, ఈ మద్యం కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి  జైలుకు వెళ్లడం ఖాయమని, వైఎస్ జగన్ జైల్లో ఉండగానే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రామకృష్ణ విశ్లేషించారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి  వర్కవుట్ కాదని, ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న ఆయన,  ఒకవేళ ఈడీ అరెస్టులు గనుక జగన్ వరకు వెళ్తే, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా  నాయకుడు మిగలడని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని  అభిప్రాయపడ్డారు.  

 

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.