తెలంగాణలో త్రిముఖ పోరు పక్కా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో గెలుపు ధీమా!

Publish Date:May 14, 2022

Advertisement

వచ్చే ఏడాది జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు పక్కా అని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ధీమా వ్యక్తమౌతున్నది. చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి ముచ్చటగా మూడోసారీ అధికార పీఠానని దక్కిస్తాయని టీఆర్ఎస్ లో ధీమా వ్యక్తం అవుతుంటే.. తెలంగాణ మౌలిక ఆశయాలను తుంగలో తొక్కి అన్న వర్గాలకూ అన్యాయం చేసిన టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్న తెలంగాణ ప్రజ ఎన్నో త్యాగాలకు సిద్ధమై తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల అభిమానం చాటుకునేందుకు కాంగ్రెస్ కే పట్టం కడతారని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. ఇక మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధే తెలంగాణలో   ప్రజలు తమకే పట్టం గట్టేలా చేస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. 

 అధికార టీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికలలో విజయం పట్ల నమ్మకమూ, అప నమ్మకమూ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో రెండవ శ్రేణి నాయకత్వం కరవైన విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మొత్తం పార్టీ అంతా వన్ మేన్ షో లేదా వన్ పార్టీ షోగా నడుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే పార్టీలో మొత్తం షో.. ఆయన తరువాత  స్థానాలలో వరుసగా కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు ఉంటారు. పార్టీకి ఇదే బలం, బలహీనతా అయ్యింది.  ఈ నలుగురినీ మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న నేతలు కానీ, ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగించగలిగే నాయకులు కానీ ఉన్నట్లు కనిపించరు. ఇక మహిళా నేతలలో  మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు అడపాదడపా ప్రెస్ మీట్లతో మెరిసినా ప్రజలలో పెద్దగా పట్టున్న నేతలు కారు. ఇక ఎమ్మెల్యేలు, మిగిలిన మంత్రుల పాత్ర పార్టీలో పార్టీ వ్యవహారాలలో నామమాత్రమే. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంకా ప్రజలలో పూర్తిగా చెరిగిపోని సెంటి మెంట్ పైనే తెరాస విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే తెరాస శ్రేణుల్లో కేసీఆర్ ఏం చేసైనా పార్టీని గెలుపు బాట పట్టిస్తారన్న విశ్వాసం ఉంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీలో కార్యకర్తల కంటే నాయకుల సంఖ్యే అధికం. అదే ఆ పార్టీకి బలహీనతగా మారింది. నేతలలో ఆధిపత్య పోరు కారణంగానే క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్, నిర్మాణం ఉన్నా వరుస పరాజయాలను ఎదుర్కొంటోది. ఇటీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నేతలలో అమస్మతి పెరిగింది. కానీ క్యాడర్ లో ఉత్సాహం నిండింది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆదరణ పెరిగేలా చేసింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో నేతల మధ్య గ్యాప్ విషయంలో స్పష్టమైన హెచ్చరిక లాంటి సంకేతాలు వెళ్లడంతో ప్రస్తుతానికి ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తున్నది. ఒకరిద్దరు బహిరంగంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదన్న ధీమా పార్టీలో కనిపిస్తున్నది.  

ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ పార్టీలో ప్రజలను ప్రభావితం చేయగలిగేలా ప్రసంగించే నేతలు మిగిలిన పార్టీలలో కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈటల, రఘునందనరావుల చేరికతో ఆ పార్టీకి ఒకింత బలం పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు.    రెండేండ్ల క్రితం కేవలం రాష్ట్ర బీజేపీలో మీడియా సమావేశాలు పెట్టి పార్టీ విధానాలను వివరించగలిగే స్థాయి ఉన్న నేతలు ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు  వారి సంఖ్య పెరిగింది. అధికార పార్టీ కంటే, విపక్ష కాంగ్రెస్ కంటే.. బీజేపీలో ప్రజాకర్షక ప్రసంగాలు చేసే నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితం అన్న ముద్ర పడిన బీజేపీ గ్రామ స్థాయిలో కూడా చెప్పుకోదగినట్లుగా బలోపేతం అయ్యింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నకలలో విజయాలే దీనికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు జాతీయ నాయకులు జెపి నడ్డా, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తెరాస పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనత, మోడీ ఛరిష్మాతో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టగలమన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.