జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ నా కొడుకును సన్మార్గంలో ఎలా పెట్టాలి అని మౌలానాను అడుగుతుంది
ఫజల్ బాబా తల్లి: సలాం వాలేకూం మౌలానా సాబ్. మేరా బేటా డ్రగ్స్ కా షికార్ బన్ గయా, హర్ దిన్ బాప్ సే మేరా బేటాకా పిటాయ్ హోరా
మౌలానా: వాలేకుం సలాం... తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టే ప్రయత్నంలో హింసించకూడదు. ప్రేమతో నచ్చజెప్పాలి. ఫజల్ బాబా ప్రెండ్స్ అనేక సార్లు డ్రగ్స్ రాకెట్ లో పట్టు బడ్డారు. మీరు అప్పుడే కంట్రోల్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు.పిల్లలను చులకన చేసే అధికారం తల్లిదండ్రులకు కూడా లేదు. సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన పిల్లలను ప్రేమతో నచ్చజెప్పాలి. పిల్లలను అవమానపరచడం సరికాదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండాలి. ఎక్కువగా వాదులాడుకోవద్దు. అప్పుడే పిల్లలు అరవడం చేయరు. సంస్కారం అతి ముఖ్యం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ముఖ్యభూమిక వహిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ప్రతీ ఒక్కరితో సంస్కారవంతంగా మాట్లాడాలి.ఈ విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నా కొడుకు ఈ తప్పు చేశాడు. ఆ తప్పు చేశాడు అని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తండ్రి మీద పిల్లలకు ఎక్స్ పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఫిర్యాదులు చేయడం వల్ల నిరాశావాదం వచ్చేస్తుంది. పిల్లలకు గౌరవం ఇవ్వాలి. పిల్లలను అమితంగా ప్రేమించాలి. పిల్లలకోసం టైం కేటాయించాలి.
పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నప్పటికీ కూతురు పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా తండ్రికే ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వరకు పాలివ్వడం తల్లి పూర్తి బాధ్యత. ఖురాన్ ప్రకారం రెండేళ్లవరకు పిల్లలకు పాలు పట్టడం తల్లి బాధ్యత. పిల్లల విషయంలో తండ్రి స్నేహితుడి మాదిరిగా ఉండాలి గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు. అదే తల్లి ప్రేమను ఎక్కువ పంచుతుంది. నవమాసాలు మోస్తుంది అంతే కాదు ప్రసవం సమయంలో అనేక నొప్పులు భరిస్తుంది. రెండేళ్లవరకు పిల్లలకు పాలివ్వడం అన్నీ కలిపి 30 నెలలు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తండ్రి మాత్రం పిల్లలను ప్రయోజకులను చేసే వరకు పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసే వరకు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలను టార్చర్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాలి. పిల్లలను మార్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారు. స్నేహితుల వల్ల ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిపై నిఘా పెట్టాలి. డబ్బు సంపాదించిన తండ్రి కంటే ఇస్లాంను అమలు చేస్తున్న వ్యక్తులే మహనీయులు అని చెప్పాలి.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/torturing-children-is-criminal-39-188104.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.