రావత్ కు నివాళి.. బ్లాక్ బాక్స్ లో ఏముంది.. జగన్ యూ టర్న్.. టాప్ న్యూస్@1PM

Publish Date:Dec 9, 2021

Advertisement

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి  పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 
---
తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిన చోట బీతావహ వాతావరణం కనిపించింది. ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్‌ చేసేందుకు ఢిల్లీకి తరలిస్తున్నారు అధికారులు. .
------
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో జిల్లా వాసి సాయితేజ మరణించడంతో స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో ఉన్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సాయి తేజ మృతదేహం గ్రామానికి చేరుకోనుంది. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అధికార యంత్రాంగం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది.
-------
గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబరు 59ను జారీ చేసింది. 
-------
జీజీహెచ్‌లో మూడోరోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అర్బన్, జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రాలు అందజేశారు. వైద్యులపై దాడులు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేసిన రాజకీయ పార్టీ వ్యక్తులను అరెస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు
------
వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్‌లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఓటీఎస్‌లో భాగంగా డబ్బులు చెల్లించాలని ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. దీందో వృద్ధ దంపతులు కంగుతిన్నారు. 
-------
ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది...' అంటూ 2009, డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేస్తోన్న స‌మ‌యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం  తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
----
కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో ఎంపీ ధర్మపురి అరవింద్  భేటీ అయ్యారు. బైంసా అల్లర్ల అనంతరం పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ పిర్యాదు చేశారు. నలుగురు కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంఐఎం నేతల ఆదేశాల అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని ఎంపీ తెలియజేశారు. 
--
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వేమనీడు త్రినాధబాబు అనే వ్యక్తిని ముఠా కిడ్నాప్ చేసింది. త్రినాధ్ బాబు తండ్రికి ఫోన్ చేసి లక్షన్నర రూపాయలను ముఠా డిమాండ్ చేసింది. ఈ కిడ్నాప్‌కు సంబంధించి వెంటనే స్పందించిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ముఠాను అరెస్టు చేసి,  త్రినాధ్ బాబును విడిపించారు. 
---
ప్రకాశం జిల్లా  పెద్దారవీడు మండలం గోబ్బురు వద్ద విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరు స్వెటర్స్ అమ్ముకునేందుకు బైక్‌పై వెళ్తుండగా మంత్రి సురేష్ కాన్వాయ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బాడిగ మహేష్‌, క్షతగాత్రురాలు ఆయన భార్య మహేశ్వరిగా గుర్తించారు. 
-------

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.