Publish Date:Aug 15, 2022
రెండు స్థంభాలకు తాడు గట్టి ఓ పిల్ల కర్ర ఆదారంతో ఆ తాడు మీద నడుస్తూ ఒక వేపు నుంచి మరో వేపు నడుస్తుంది. ఈలోగా నేల మీద జనం చూస్తు ఆశ్చర్య పోతూంటారు. ఒకడు డప్పు వాయిస్తూ పాటందుకుం టాడు.. ఇది మనం చిన్నపుడు చూసిన, ఇప్పటికీ మర్చిపోలేని గొప్ప ఫీట్. దీనికే మనం ఓర్నీ ఏం నడిసిందిరా! అనుకున్నాం. మరో వ్యక్తి కాలుతున్న కర్రముక్క కిల్లీ వేసుకున్నట్టు నోట్లో వేసుకుని క్షణం తర్వాత తనకేమీ తెలీన్నట్టు బయటికి ఉమ్మేస్తా డు. ఇదో గొప్ప ఫీట్! మరి గాల్లో పుల్లప్స్ చేసేవాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!
ఇటీవలికాలంలో ఫిట్నెస్ పిచ్చి పెద్ద పెద్ద నగరాల నుంచి మారుమూల పల్లెల వరకూ పట్టుకుంది. కుర్రాళ్లకి వారి సినీ హీరోలు సల్మాన్, ప్రబాస్లా తయారైపోతే అమ్మాయిలు ఢామ్ అని పడతారని గొప్ప నమ్మకం. ఈ పిచ్చిలో అనేక వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చేసే వ్యాయామాలకు పరిమితి ఉంటుంది. కానీ ఓవరాక్షన్ చేస్తే అది ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అన్నట్టు ఈ ఫిట్నెస్ పిచ్చి ప్రపంచదేశాల్లో ఏకంగా గిన్నిస్బుక్లోకి ఎక్కెంతగా పట్టింది. ఏదో ఒకటి చేసే బదులు పుషప్స్ చేసి రికార్డుల్లోకి ఎక్కాలనే కుర్రాళ్ల సంఖ్య మరీ పెరిగిపోయింది. ఆ మధ్య స్టాన్ బ్రౌనీ స్నేహితుడు అర్జెన్ ఆల్బర్స్ ఏకం గా ప్రపంచరికార్డు బద్దలు కొట్టాడట. అతను వాళ్లింటో పుషప్స్ చేస్తూ జనాన్ని, గిన్నిస్ సంస్థ అధికారులను పిలిచి టీలు, కాఫీలు ఇచ్చి వాళ్లెదుట పుషప్స్ చేయలేదు. అతగాడి పిచ్చికి ఏకంగా హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. అదెలా సేసేడ్రా బావా.. అని మనూళ్లలో అనుకునేలాగానే పూర్తి చేసి రికార్డు సాధించారు.
ఈ ఏడాది జూలై 6న బెల్జియం ఆంట్వర్ప్లో స్టాన్, ఆల్బర్స్ లు ప్రపంచరికార్డు అధిగమించే పులప్స్ పోటీకి సిద్దపడ్డారు. హెలికా ప్టర్ వెళుతూంటుంది, దానికి వేలాడుతూ పులప్స్ చేయడం. ఏమాత్రం పట్టు తప్పినా, చేసే క్రమం తప్పినా మనిషి దక్కడు. కానీ వాళ్లిద్దరికీ ప్రాణాలకంటే ప్రపంచ రికార్డు మీదే ప్రేమ. అదే సాధించారు. వీళ్లు ఏకంగా 25 పులప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీళ్లు సామాన్యలు కాదనుకున్నారు అందరూ. కిందకి రాగానే తాకి మరీ చూశారు.. బతికే ఉన్నారా, పోయా రా అని! ఇలా హెలికాప్టర్ పులప్స్ చేయడం ఇపుడు ప్రపంచపోటీల్లో భాగం చేస్తారట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/too-crazy-39-141945.html
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల అరెస్ట్ సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.