టాలీవుడ్ ‘మేముసైతం’ ఎవరికోసం?

Publish Date:Nov 28, 2014

Advertisement

 

విశాఖని అల్లకల్లోలం చేసిన హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ‘మేముసైతం’ పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత నెల రోజులుగా ఈ అంశం మీద టాలీవుడ్‌లో హడావిడి జరుగుతోంది. ఈనెల 30న సినిమా ప్రముఖుల క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ఆటలు, పాటలు, రకరకాల వినోద కార్యక్రమాలు, స్టార్స్‌తో కలసి భోజనాలు... ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ నిర్వహించడం ద్వారా సేకరించిన మొత్తాన్ని హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం వినియోగిస్తారు. ఈ ‘మేముసైతం’ కార్యక్రమం కోసం టాలీవుడ్ పడుతున్న శ్రమ చూస్తుంటే సినిమా రంగంలోని వారు సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఇంత మంచివాళ్ళయిన సినిమా వాళ్ళు మనకి ఉన్నందుకు ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతోంది. అయితే ‘మేముసైతం’ పేరుతో టాలీవుడ్ చేస్తోన్న ఈ హడావిడి అంతా జనం కోసం కాదని.. తమ స్వలాభం కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుద్ హుద్ బాధితుల సంగతి అలా వుంచితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాకాపట్టడానికే టాలీవుడ్ ప్రముఖులు ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మేముసైతం’ వెనుక వున్న అసలు గుట్టుని విమర్శకులు ఇలా వివరిస్తున్నారు.

 

ఎన్నికల ముందు సినిమా పరిశ్రమ చంద్రబాబు నాయుడికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో సినిమా పరిశ్రమ కోసం ఎంతో చేశారు. అయితే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత సినిమా పరిశ్రమ ఆయన్ని లైట్‌గా తీసుకుంది. ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే విషయంలో కూడా గతంలో చంద్రబాబు నుంచి అనేక ఉపకారాలు పొందినవాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఎన్నికల సమయంలో సినిమావాళ్ళు చంద్రబాబుకి మద్దతుగా నిలిస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుందని ఎందరూ చంద్రబాబు ఛాయలకు కూడా పోలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే కొంతమంది సినీ ప్రముఖులు కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు తప్ప చంద్రబాబుని కలసి నైతిక మద్దతు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. చంద్రబాబు మనసులో ఆ బాధ వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దాంతో నాలుకలు కరుచుకున్న టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ చంద్రబాబుకి దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా హుద్ హుద్ తుఫాను విధ్వంసం వారికి మంచి అవకాశంలా కనిపించింది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే ఈ ‘మేముసైతం’ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శకులు అంటున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగంలో అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికితోడు ప్రఖ్యాత ఎరోస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి తెలుగు సినిమా రంగంలో ప్రముఖులెవర్నీ సంప్రదించకుండా, సలహాలు కూడా అడక్కుండా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళారు. ఈ చర్య టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా గతుక్కుమనేట్టు చేసింది. తమను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమైంది. సినిమా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే ముఖ్యం. సినిమా ప్రముఖులు నిర్వహిస్తున్న సినిమా వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాభాలు పొందాలంటే అక్కడి ముఖ్యమంత్రి సహకారం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎరోస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ముందు ముందు థియేటర్లు, ఇతర అంశాలకు సంబంధించి కూడా టాలీవుడ్ ప్రముఖులను పక్కన పెట్టేస్తే, టాలీవుడ్‌లో వున్న మోనోపాలీకి గండి కొట్టేస్తే వాళ్ళ వ్యాపారాలు నేలమట్టమయ్యే ప్రమాదం వుంది. దీన్ని ఊహించే టాలీవుడ్ వ్యాపార రంగంలో పెద్దలుగా వున్న కొందరు ముందుండి ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, బోలెడంత నిధులను సీఎం సహాయ నిధికి ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చేరువ అవ్వచ్చన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. అమ్మ టాలీవుడ్డూ...

By
en-us Political News

  
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.