జగన్ సర్కార్’కు టాలీవుడ్ ... బిగ్ శాల్యూట్

Publish Date:Jun 17, 2022

Advertisement

తెలుగు చిత్ర సీమకు,రాజకీయ చుట్టరికం కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’ లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, చాలా మంది  నటీ నటులు, రాజకీయ అరంగేట్రం చేశారు. పాత తరం హీరో కంమ్ విలన్  కొంగర జగ్గయ్య మొదలు నట శేఖర కృష వరకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి పార్లమెంట్’ లో అడుగు పెట్టారు. అలాగే హీరోయిన్లలో జమున కూడా కాంగ్రెస్ ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే, వాణిశ్రీ, వంటి ఇంకొందరు  ప్రముఖ నటీనటులు చట్టసభల్లో కాలు పెట్టక పోయినా కాంగ్రెస్ పార్టీలో, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఎర్ర సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచినా మాదాల రంగా రావు,  కమ్యూనిస్ట్ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించారు.  అలాగే అల్లు రామలింగయ్య చివరి వరకు, సిపిఎం పార్టీకి ప్రతి సంవత్సరం ‘సెస్’ ( చందా)  ఇచ్చేవారని అంటారు. 

ఇక, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అన్న ఎన్టీ రామ రావు స్థాపించిన తెలుగు దేశం హయాంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఆది సినిమా రాజకీయ అనుబంధానికి స్వర్ణ యుగం అని చెప్పవచ్చును. ఆ కాలంలో  ఎందరో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఒకరని కాదు 24 ఫ్రేమ్స్  కు చెందిన అనేక మంది సినిమా ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలలో క్రియాశీల భూమికను పోషించారు. తెలుగు దేశం టికెట్ పైన, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. బాబూ మోహన్ వంటి ఒకరిద్దరు మంత్రులుగానూ ఓ వెలుగు వెలిగారు.

నిర్మాత రామానాయుడు, నటీ నటులు నందమూరి బాల కృష్ణ, హరికృష,  మురళీ మోహన్, సత్యనారాయణ, రావు గోపాల రావు, బాబు మోహన్, కోట శ్రినివాస రావు, శారద, జయ ప్రద, జయ సుధ, కే . రోజా, ఇంకా అనేక  మంది తెలుగు దేశం పార్టీ వేదిక నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలు మారినా ఇప్పటికీ కొందరు క్రియాశీలంగా, కీలక పదవుల్లో ఉన్నారు.  అలాగే రెబెల్ స్టార్ క్రిషన్ రాజ, కోట శ్రీనివాస రావు, నరేష్ వంటి చాలా మంది నటీనటులు బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. కృష్ణం రాజు అయితే, వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మత్రిగా పనిచేశారు. 

అదే విధంగా  మెగా స్టార్  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానూ కొందరు, నటీ నటులు సినీ ప్రముఖులు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. అయితే, చిరంజీవి అతి తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం దుకాణం మూసి వేయడం వల్లనో ఏమో తమ్ముడు, పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణ మురళీ తప్పించి పెద్దగా సినిమా వాళ్ళు చిరంజీవితో చేయి కలపలేదు. కలిసి నడవలేదు. చివరకు తమ్ముడు పవన్ కళ్యాణ్’ కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించి,వేరు కుంపటి(జనసేన) పెట్టుకున్నారు. 
ఇక ప్రస్తుతానికి వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సినిమా వాళ్ళకు పొలిటికల్ ప్యాట్రనేజ్ పెద్దగా దక్కడం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా వాళ్ళను కూరలో కరివేపాకులా వాడుకుని  వదిలేస్తున్నారు. అంతే కానీ, వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించిన విజయ శాంతి మొదలు నిన్నమొన్న ఇట్లా దగ్గర చేసి అట్లా పక్కన  పెట్టిన ప్రకాష్ రాజ్ వరకు  ఎవరికీ కాసింత గౌరవం ఇచ్చింది లేదు. అందరి విషయంలోలానే సినిమా వాళ్ళ విషయంలోనూ కేసీఆర్, యూజ్ అండ్ త్రో’ పద్ధతినే పాటించారని  అంటారు. 

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి, సినిమా హీరోలను జీరోలుగా చేసిన, ‘ఘనత’ జగన్ రెడ్డికే దక్కింది. సినిమా టికెట్ ధరల చుట్టూ వివాదాన్ని సృష్టించి, వివాదం పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం  సినిమా రంగం పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. అదే విధంగా రాజకీయ పదవుల విషయంలోనూ జగన్ రెడ్డి, చిరంజీవి మొదలు అలీ వరకు, మోహన్ బాబు  మొదలు పోసాని కృష్ణ మురళీ, వరకు ప్రతి ఒక్కరితో ఒకే విధంగా ఆడుకున్నారనే టాక్  టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకే, ఇంతవరకు ఏవో ఆశలతో, వైసీపే కండువా కప్పుకుని, జగన్ రెడ్డిని నెత్తిన మోసిన, పెద్దల ఆశలు మంచులా కరిగి పోయాయని, ఇంకొందరేమో, జగన్ రెడ్డి ని మోసి నందువలన తమకు దక్కింది ఏమీ లేక పోగా సినిమాల్లోనూ అవకశాలు రావడం లేదని అ వాపోతున్నారు.

అందుకే జగనన్నా నీకో దండం అంటున్నారు.  అదలా ఉంటే  రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్దికి అవకాశాలున్నా, సినిమా  రంగం అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిన్న చూపని, అర్థమయింది కాబట్టే, స్టుడియోల నిర్మాణానికి ఫ్రీ ల్యాండ్ సహా ఇతర సదుపాయాలు కలిపిస్తామని చెప్పినా, ఎవరూ ముందుకు రావడం లేదని, అంటున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.