జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదే!

Publish Date:Aug 12, 2017

Advertisement

 

ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఏదన్నా జబ్బు చేసినప్పుడు అస్సలు ఆకలి వేయనే వేయదు. కంటి ముందు నోరూరించే పదార్థాలు ఎన్ని ఉన్నా, వాటిని తినాలన్న కోరికా ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా ఆలోచించారా?

ఒంట్లో జ్వరంలాంటి సమస్య ఉన్నప్పుడు ఆకలి వేయకపోవడానికి కారణం ఉందంటారు మన పెద్దలు. శరీరం తనని తాను బాగుపర్చుకునే క్రమంలో ఆహారం తీసుకునేందుకు ఇష్టపడదని చెబుతారు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు చాలా శక్తి కావల్సి వస్తుంది. కానీ కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఈ శక్తి అంతా రోగకణాల మీద పోరాడేందుకు ఉపయోగపడుతుంది.

పెద్దలు చెప్పిన మాటలలో కొంత నిజం లేకపోలేదంటారు శాస్త్రవేత్తలు. అయితే ఈ ఉపవాసం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయంటున్నారు.

- ఒంట్లో రోగకణాలు ఉన్నప్పుడు, వాటిని ఎదుర్కొనేందుకు శరీరం cytokines అనే పదార్థాలని విడుదల చేస్తుంది. ఈ cytokinesతో అటు రోగనిరోధక శక్తి బలపడటంతో పాటుగా, ఇటు ఆకలి కూడా తగ్గిపోతుంట.

- జలుబు, దగ్గులాంటి సమస్యలు వచ్చినప్పుడు వాసన తెలియదు. ఆకలికీ వాసనకీ మధ్య సంబంధం తెలియంది కాదు కదా! ఏ వాసనా ఎరగకపోవడం వల్ల తినాలని అనిపించదు.

- చాలారకాల రోగాలకి మన ఒంట్లోకి చేరుకునే చెడు బ్యాక్టీరియానే కారణం. ఒంట్లో గ్లూకోజ్‌ బాగా ఉంటే... ఈ బ్యాక్టీరియా హాయిగా బలపడుతుంది. ఆ గ్లూకోజ్ మన ఆహారం ద్వారానే అందుతుంది. కడుపు ఖాళీగా ఉంటే, ఒంట్లో గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోతాయి. ఫలితం బ్యాక్టీరియా కూడా బలహీనపడిపోతుంది. అయితే ఈ చిట్కా వైరస్‌ల వల్ల వ్యాపించే రోగాలకి వర్తించదు.


ఒంట్లో బాగోలేనప్పుడు ఆకలి వేయకపోవడం మంచిదే అని తేలిపోయింది. అయితే ఆ సమయంలో తగినంత నీరు తీసుకుంటూ ఉండాలనీ, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. లేకపోతే శరీరం మరింతగా నీరసించిపోయి సరికొత్త సమస్యలు మొదలవుతాయి.


చిన్నాచితకా రోగాలలో ఆకలి లేకపోవడం వల్ల లాభమే కానీ నష్టం లేకపోవచ్చు. కానీ క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులలో ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు ఆహారం తీసుకోకపోవడం వల్ల మనిషి త్వరగా మృత్యుముఖానికి చేరుకుంటాడు. అందుకనే ఇప్పుడు రోగసమయంలో ఆకలి తగ్గకుండా చూసేందుకు ఓ చికిత్సను కనుగొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. శరీరం జబ్బు పడినప్పుడు  interleukin 18 (IL-18) అనే కణాలు ఆకలి వేయకుండా చేస్తున్నాయని గుర్తించారు. మందుల ద్వారా ఈ IL-18 కణాలను నియంత్రించే ప్రయత్నాలు మొదలయ్యాయి.


- నిర్జర.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.