మోక్షం పొందాలంటే కుంభమేళాలో చనిపోవాలట

Publish Date:Feb 5, 2025

Advertisement

ఆత్మార్పణం చేసుకోవడం చట్టరీత్యా నేరం. సనాతన ధర్మం కూడా మహాపాపం అని బోధిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, సంపన్నులు  అక్కడే చనిపోవాలని  బీహార్ స్వతంత్ర ఎంపీ  పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కుంభమేళాలో చనిపోతే  వారికి మోక్ష  ప్రాప్తి లభిస్తుందని ఆయన బోధిస్తున్నాడు. ఇటీవల అక్కడ తొక్కిసలాట  జరిగి 30 మందికిపైగా చనిపోయారు. 60 కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ సదరు ఎంపీ మాత్రం యోగి ఆదిత్యనాథ్ పక్షాన నిలబడి కుంభమేళాలో చనిపోతే  మోక్ష ప్రాప్తి లభిస్తుందని కొత్త నిర్వచనం చెప్పి వార్తల్లోకెక్కాడు లోక్‌సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ చనిపోయిన వారి మృతదేహాలను హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగాయని యుపి సర్కార్ తరపున వకాల్తా పుచ్చుకుంటే ప్రతి పక్షాలు మాత్రం వేరే విధంగా చెబుతున్నాయి. కుంభమేళ జరుగుతున్న త్రివేణి సంగమంలో మృతదేహాలను పారవేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.   కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా  తనతో చెప్పారని  పప్పు యాదవ్ తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, ధనికులు, బాబాలు కుంభమేళాలో  చనిపోవడమే మార్గమని చెప్పుకొచ్చారు చట్టాలను రూపొందించే చట్ట సభలోనే పార్లమెంటు  సభ్యుడి హోదాలో భక్తులను చనిపోవాలని వింత కోరిక కోరడం  ఇపుడు దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది. 
మోక్షానికి మూడుమార్గాలు ఉన్నవని ఆధ్యాత్మిక గురువులు  చెబుతున్నారు. ఒకటి  భక్తి మార్గం,  రెండు జ్ఞాన మార్గం,  మూడు యోగమార్గం.
ఇందులో  మొదటిది భక్తిమార్గం. ఇది సులభతరం.  పూజలు, వ్రతాలు, భజనలు, కైంకర్యాలను ప్రోత్సహించటం వల్ల మోక్షం పొందొచ్చు.  
రెండోది జ్ఞానమార్గం.  జ్ఞానులుగా జన్మించి అంటే ఎన్నోజన్మలుగా సత్కర్మలు చేసి   మోక్షంవైపు వేగంగా అడుగులు వేయొచ్చు.  
మూడవది యోగమార్గం.  ఈ మార్గంలోఅతి కఠినమైన యోగ సాధన చేయాలి. దీనికి గురువుల అనుగ్రహం కంపల్సరీ. 
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల  సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది 
 

By
en-us Political News

  
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీపగబట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరనుందని అన్నారు. తమకు అధికారం దక్కని దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ కోపం పెంచుకుని వివక్ష చూపుతోందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమెళి, రాజాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (మార్చి 13) సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో నాగం మంత్రిగా పని చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీలోని సీనియర్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారనేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒక్క కాంగ్రెస్ అనేమిటి ఈ సీనియర్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారని దుయ్యబట్టారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉంది రక్షణ కల్పించండంటూ కడప ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ మేరకు ఎస్పీకి లేఖ ఇచ్చాడు. గతంలో తనకు ఇచ్చిన భద్రతను పునరుద్ధరించాలని ఆ లేఖలో కోరాడు.
ఇంట్లో మగాళ్లు తాగుతుంటే మహిళలు గగ్గోలు పెడుతుండటం చూస్తూనే ఉంటాం. మందుబాబుల వీరంగాలతో గృహహింస కేసులు కామన్‌గా మారిపోతున్నాయి. అయితే అక్కడ మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తున్నది. ఆ గ్రామంలో మహిళలు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని అదే గ్రామానికి చెందిన పురుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 తెలంగాణలో వరుసగా లిప్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లిప్ట్ గోడ మధ్యలో చిక్కుకుని  ఓ బాలుడు మృతి చెందాడు. జగిత్యాలలో సిరిసిల్లా 17వ బెటాలియన్  కమాండెంట్ గంగారాం (59)లిప్ట్ లో ఇరుక్కుని చనిపోయాడు.
గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.