ఇవి నేర్పిస్తే చాలు.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

Publish Date:Feb 5, 2024

Advertisement

పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఎంతో అవసరం. వేగవంతమైన ప్రపంచంలో సక్సెన్ ను అందుకోవాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు పిల్లలు లక్ష్యాలను చేరుకోవడంలోనూ, చదువులోనూ, ఇతర కార్యకలాపాలలోనూ వెనుకబడి ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతేనే ఇలా జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. పిల్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే వారి భవిష్యత్తు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం ఈ కీంది విషయాలు పిల్లలకు నేర్పించాలి.


పిల్లలు ఏదైనా ప్రయత్నం చేసి ఓడిపోతే ఓటమి గురించి వారిని తిట్టకండి. ఓడిపోవడం సాధారణ విషయమని, ఓటమి నుండి  పాఠాలు నేర్చుకుని తరువాత మళ్లీ ప్రయత్నం చెయ్యాలని పిల్లలకు చెప్పాలి. దీంతో ఓటమితో అంతా ముగిసిపోలేదు అనే భావన, తరువాత ప్రయత్నాలకోసం తగినంత ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది.

సంకల్పబలం గురించి పిల్లలకు వివరించాలి. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదని, పనిని మధ్యలో వదిలేయడం లాంటివి చెయ్యకూడదని వారికి చెప్పాలి. ఇలా చేస్తే ప్రతి పనిని వారు పూర్తీ నిబద్దతతో పూర్తీ చేస్తారు.


ఏకాగ్రత లేకపోతే ఏ పనీ చెయ్యలేరు. పిల్లలకు అదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఏకాగ్రత పెంచడానికి ధ్యానం,  యోగా  వంటివి అలవాటు చెయ్యాలి.

ఏ పని చేసినా అందులో తాము గెలిచితీరాలని పెద్దల నుండ పిల్లల వరకు అందరూ కోరుకుంటారు. పిల్లలు అయితే చాలా డిజప్పాయింట్ అవుతారు. కానీ గెలుపు ఎలాగో ఓటమి కూడా అలాగే వస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీంతో గెలుపోటములను సమానంగా యాక్సెప్ట్ చేస్తారు.

పిల్లలు పెద్దయ్యే కొద్దీ తాము స్పెషల్ అనే ఫీలింగ్ కు లోనవుతారు. వారు తమకు గౌరవం కావాలని, అందరూ తమను గౌరవించాలని అనుకుంటారు. ఈ విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. గౌరవం లభించాలంటే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించాలి.

పిల్లలు బేలగా ముఖం పెట్టగానే తల్లిదండ్రులు కగిరిపోయి పిల్లల పనిని తాము చేసేస్తారు. దీని వల్ల పిల్లలు నేర్చుకునే సామర్ద్యం కోల్పోతున్నారు. అందుకే ప్రతి పనిని పిల్లలు స్వయంగా చేసేటట్టు చూడాలి. అవసరమైతేనే తల్లిదండ్రులు సహాయం చెయ్యాలి.


                                        *నిశ్శబ్ద.

By
en-us Political News

  
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు.
ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది.
పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు.
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా..
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా..
స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది.
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు....
ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి...
సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది.
జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి.
మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.