Publish Date:Jan 27, 2025
తెలంగాణలోస్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయయి పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీ కాలం ఆదివారం (జనవరి 26)తో ముగిసింది. దీంతో అదే రోజు రాత్రి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండలపరిషత్, జిల్లాపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలకు సమాయత్తం అయ్యింది. గ్రామ పంచాయతీల టర్ల తుది ఓజాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం (జనవరి 26) నాలుగు సంక్షేమ పథకాల అమలును ఆరంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇళ్లు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తున్నందున కొత్త పథకాల అమలు కుదరదు కనుకే రాష్ట్ర ప్రభుత్వం ఒకింత వేగంగా సంక్షేమ పథకాల అమలుకు రెడీ అయిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు కసరత్తు ఆరంభించింది. ఇప్పుడు నాలుగు పథకాల అమలుతో ప్రజలకు చేరువయ్యామని భావిస్తున్న రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అలా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/time-for-telangana-panchayat-elections-schedule-25-191897.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!