కేసీఆర్ కుటుంబంలో మూడో తరం పొలిటికల్ ఎంట్రీ!?

Publish Date:Oct 2, 2023

Advertisement

 కేసీఆర్ కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయక్షేత్రంలో ప్రవేశించింది. ఎన్నికల వేళ ముచ్చటగా మూడో సారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంటే, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కుమారుడు అయిన కల్వకుంట్ల హిమాన్షురావు.. రాజకీయాలలోని ఘనంగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ప్రజా వ్యతిరేకత పట్ల ఆందోళన వ్యక్తమౌతున్న తరుణంలో కల్వకుంట్ల హిమాన్షురావు ఒక ట్వీట్ తో అందరి దృష్టినీ ఆకర్షించారు. 

వాస్తవానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయపార్టీల కంటే ముందుగా సన్నద్ధమైన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ మాత్రమే. మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. కొత్తకొత్త పథకాలను ప్రకటించేసి.. హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి బయటపడ్డాయి.  సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రత్యర్థులకు అందని వేగంతో వ్యూహాలు రచించడంలోనూ మేటిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎత్తుగడలు పారడం లేదు. వ్యూహాలు ఫలించడం లేదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. అటువంటి వేళ ఆయన వైరల్ ఫీవర్ తో గత పది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. తన నివాసంలోనే వైద్యుల బృందం పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 

అదలా ఉంటే.. మోడీ తెలంగాణ పర్యటనతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించేసింది. జనం నమ్ముతారా? నమ్మరా అన్న విషయంతో పని లేకుండా గత ఎన్నికల ముంగిట ఇచ్చి అమలు చేయని పసుపుబోర్డు హామీని మరోసారి ఈ ఎన్నికల ముంగిట మోడీ ప్రకటించేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా రాష్ట్రంలో ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారింది. గెలుపు ధీమాతో ముందుకు సాగుతోంది. ఆ పార్టీకి సహజ లక్షణం అని అంతా చెప్పుకునే గ్రూపు విభేదాలు, అసమ్మతి, అసంతృప్తి గళాలు ఈ ఎన్నికల ముంగిట పెద్దగా కనిపించడం లేదు. ఒక వేళ అవి వినిపించినా, కనిపించినా వెంటనే అధిష్ఠానం జోక్యం చేసుకుని ఎవరి హద్దులు వారికి గట్టిగా అర్ధమయ్యేలా చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత, సమష్టితత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

అయితే అదే సమయంలో బీఆర్ఎస్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధినేతపైనే అసమ్మతి ఆస్త్రాలు సంధిస్తోంది. అదే సమయంలో గతంలోలా కేసీఆర్ ఆధిపత్యం పార్టీపై పెద్దగా కనిపించడం లేదు. నేరుగా కేసీఆర్ ను విమర్శించకపోయినా, అసమ్మతులు ఆయన బుజ్జగింపులకు, హెచ్చరికలకు తలొగ్గి సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. అన్నిటికీ మించి అసమ్మతులు పిలుపు వచ్చినా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు పెద్దగా సుముఖత చూపడం లేదని పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నది.  ఇటువంటి తరుణంలో కేఃసీఆర్ కుటుంబం నుంచి మూడో తరం నాయకత్వం రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తాజా ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు.  కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు.. కానీ తాను మాత్రం తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్నాను అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షురావు ట్వీట్ చేశారు. దానికి  KCROnceAgain అనే హ్యాగ్‌ట్యాగ్‌ను  జత చేశారు. ఎన్నికల ముంగిట హిమాన్షు చేసిన ఈ  ట్వీట్ ప్రాధాన్యత  సంతరించుకుంది.

హిమాన్షు ఇంకా విద్యార్థే, చదువుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. అదే సమయంలో సామాజిక మాధ్యమంలో మాత్రం ఇటీవలి కాలంలో యాక్టివ్ అయ్యారు.  బీఆర్ఎస్ సర్కార్ కు, కేసీఆర్ కు అనుకూలంగా తరచూ ట్వీట్ చేస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలకు కేంద్ర బిందువుగా మారారు.  కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుడుతున్నాడు. సరిగ్గా రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంగా కేసీఆర్ వన్స్ ఎగైన్ హ్యాష్ ట్యాగ్ తో హిమాన్షు చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, అందరి దృష్టినీ ఆకర్షించింది.   వచ్చే ఎన్నికల్లో హిమాన్షురావు సామాజిక మాధ్యమం వేదికగా బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తారనడానికి ఆయన తాజా ట్వీటే తిరుగులేని ఉదామరణ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.