హిట్ మ్యాన్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్.!?

Publish Date:Jul 17, 2026

Advertisement

ఇండియన్  క్రికెట్ హిస్టరీలో తనదైన ముద్ర వేసిన స్టార్ ఓపెనర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ  ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిందా? ఇప్పటికే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే లకు కూడా దూరం కానున్నాడా.. అంటే బీసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఔననే అనాల్సి వస్తోంది.  గత కొంతకాలంగా   ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ కు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీసే చివరి సిరీసా అన్న చర్చ జోరుగా నడుస్తోంది.  

ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన పట్ల అతడి అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇంగ్లాండ్ తో గురువారం (జులై 16)  జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్   47 బంతులు ఎదుర్కొని 26 పరుగులు మాత్రమే చేసి ఔటైన తీరుతో అతడి క్రికెట్ కెరీర్ ఫ్యూచర్ పై అందరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే మ్యాచ్ అతని కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.  

 పీటీఐ వెల్లడించిన కథనం ప్రకారం, రోహిత్ స్థానంపై బీసీసీఐ,  సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెరీర్ విషయంలో ఇప్పటికే చర్చలు జరిపారు.   2027 వన్డే వరల్డ్ కప్ ను  దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే  జట్టులోకి యువతను తీసుకోవాలని యోచిస్తున్నారు.    39 ఏళ్ల  రోహిత్ శర్మ స్థానంలో, ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు   అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. . 2027 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా దాదాపు 20   వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడనుంది.   ఈ కీలకమైన మ్యాచ్‌లలో జైస్వాల్‌కు ఓపెనర్‌గా పూర్తి స్థాయి అవకాశం కల్పిస్తేనే  వరల్డ్ కప్ కు ప్లస్ అవుతుందన్నది సెలక్టర్లు, బీసీసీఐ యోచన చేస్తున్నట్లు పీటీఐ కథనం పేర్కొంది.  

రోహిత్ కు సెప్టెంబర్ నెలలో విండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో స్థానం అనుమానమేనని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.   ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు పరిశీలనలో లేదన్న విషయాన్ని ఇప్పటికే సెలక్టర్లు అతనికి తెలిపారని విశ్వసనీయ సమాచారం.   మరో వైపు విరాట్ కోహ్లీ తన  ఫామ్, అత్యుత్తమ ఫిట్‌నెస్ కారణంగా జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.  

Rohit Sharma,  ODI Retirement, India vs England ODI, Yashasvi Jaiswal

By
en-us Political News

  
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.