Publish Date:Aug 25, 2022
దేశంలో క్రికెట్ ఒక మతం.. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు ఉన్న పాపులారిటీ కంటే.. మ్యాచ్ లో ఓ సెంచరీ చేసిన ఆటగాడికి రాత్రికి రాత్రి వచ్చేసే పాపులారిటీ అంత కంటే ఎక్కువ.1983లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఫైనల్ లో అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ను మట్టి కరిపించిన కపిల్ డెవిల్స్(భారత జట్టు) దేశంలో క్రికెట్ కు ఆదరణ పెంచేసింది.
ఒక్క సారిగా దేశంలో క్రికెట్ మానియా పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే గెలవాలి అని అభిమానులు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఆటగాళ్ల ఇళ్లపై దాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అయితే ఇవ్వన్నీ ఒకెత్తు.. దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ఒకెత్తులా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ లా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం అంత టెన్షన్ ఇరు దేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఒక విధమైన తెలియని ఉద్వేగం నిండి ఉంటుంది.
ఇరు దేశాల మధ్యా సంబంధాల కారణంగా గత కొన్నేళ్ల నుంచీ ఇరు దేశాల మధ్యా సిరీస్ లు జరగడంలేదు. కానీ ఆసియాకప్, వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మాత్రం ఇరు జట్లూ తలపడే అవకాశం మాత్రం లభిస్తోంది. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఆ సిరీస్ ఏదో ఇరు దేశాల ప్రతిష్టకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అలాగే ఇరు జట్లూ కూడా యాషెస్ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి. అయితే భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే యాషస్ ను మించిన ఉత్కంఠ ఉంటుంది. యాషస్ సీరీస్ ను మించిన ఆసక్తి ఉంటుంది.
ఇప్పుడు వరల్డ్ కప్ ముంగిట 1986 ఆసియాకప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ తలపడిన మ్యాచ్ గురించి గుర్తు చేసుకోవడం అప్రస్తుతం ఎంతమాత్రం కాదు. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అదో పీడకల అన్నాడు. అసలింతకీ 1986లో ఆషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అప్పటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. గెలిచేశామనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి పరాజయం పాలయ్యాం. అది నిజంగా నమ్మలేని సంఘటన. ఆ మ్యాచ్ గురించి తలుచుకుంటే నిద్ర పట్టదు. ఇప్పటి దాకా అలాంటి నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను అంటాడు.
ఇంతకీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు చేయాలి. క్రిజ్ లో మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. చివరి బంతికి నాలుగు పరుగులు అంటే ఒక్క బౌండరీ చాలు. ఆ బౌండరీ ఇవ్వకూడదన్న పట్లుదలతో భారత జట్టు ఫీల్డింగ్ ను మోహరించింది. అయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి మియాందాద్ భారత్ చేతుల్లోంచి మ్యాచ్ ను ఎగరేసుకు వెళ్లిపోయాడు. భారత జట్టులో నిరాశ, బాధ.. పాక్ శిబిరంలో సంబరాలు. చివరి బంతికి ఓటమిని కెప్టెన్ కపిల్ దేవ్, జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కపిల్ అయితే చాలా ఏళ్ల వరకూ ఆ ఓటమి ఓ పీడకలలా వెంటాడిందని చెబుతాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/that-defeat-is-a-nightmare-says-kapildev-on-1986-asiacup-final-match-39-142653.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.