Publish Date:Mar 11, 2025
సోము కోసం గాల్లోకి లేచిన రెండు విమానాలు
బాలయోగి ఎపిసోడును తలపించిన సోము వీర్రాజు నామినేషన్ ఘట్టం
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో సంచలనమైన ఎపిసోడ్ నడిచింది. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ వేసేందుకు చివరి నిమిషం వరకూ టెన్షన్ వాతావరణమే నడిచింది. ఆయనకు బీ-ఫారం ఇచ్చేందుకు రెండు విమానాలు గాల్లోకి లేచాయంటే ఎంతటి టెన్షన్ రేగిందో అర్థం చేసుకోవచ్చు. బీ-ఫారం కోసం ఒక విమానం.. బీ-ఫారం మీద సంతకం చేసే పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం మరో విమానం ఆఘమేఘాల మీద మేఘాల్లో తేలుకుంటూ విజయవాడకు చేరుకున్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యమైనా నేరుగా హెలీకాప్టరులో అసెంబ్లీ సమీపంలో దిగేందుకు కూడా ఏర్పాట్లు చేశారంటే సోము వీర్రాజు నామినేషన్ ఎపిసోడు ఎంతటి టెన్షన్ పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం సోము వీర్రాజు అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారు అయినట్లు తేలింది. బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పార్లమెంటు సమావేశాల కోసం సోమవారం ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. విచిత్రంగా సోము వీర్రాజు నామినేషన్ వెయ్యడానికి ఏపీ స్టేట్ బీజేపీ ఆఫీసులో బీ ఫారాలు నిండుకున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు బీ ఫారాలు లేవని తెలియజేశారు. ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర నాయకత్వానికి ఒకరిద్దరు సీనియర్ నాయకులు వివరించడంతో వెంటనే అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లోలో దగ్గుబాటి పురంధేశ్వరి బీఫారమ్ పై సంతకం చెయ్యడానికి, సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీ ఫామ్ తీసుకుని విజయవాడకు మరో స్పెషల్ ఫ్లైట్ బయలుదేరింది. గన్నవరం నుంచి బీ-ఫారంతో ఓ విమానం.. ఆ బీ-ఫారంపై సంతకం పెట్టడానికి పురందేశ్వరి ఢిల్లీ నుంచి మరో ఫ్లైటులో ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానాల్లో చేరుకున్నారు.
పురంధేశ్వరి రావడం ఆలస్యమైతే.. బీ-ఫారం మీద సంతకం పెట్టే అధికారం బీజేపీ సీనియర్ నేత కాశీరాజుకు అప్పజెప్పింది అధినాయకత్వం. దీంతో కొంత టెన్షన్ తగ్గినా.. అధ్యక్షురాలు లేకుండా నామినేషన్ వేయడం సరికాదనే భావనతో ఢిల్లీ నుంచి పురంధేశ్వరి హుటా హుటిన వచ్చారు. పురందేశ్వరి వచ్చేలోగానే కాశీరాజు సంతకం చేసిన బీ ఫారంపై నామినేషన్ వేసేందుకు సిద్దమవుతుండగా.. ఢిల్లీ నుంచి పురందేశ్వరి చేరుకున్నారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 2.46గంటలకు అంటే నామినేషన్ల గడువు మరో 14 నిమిషాల్లో ముగుస్తుందనగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సోము వీర్రాజును అభినందిస్తూ… మీ ఢిల్లీ పెద్దలు నీ పేరు చెప్పబట్టే నేను బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చానని, లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న ఒత్తిడికి ఇచ్చే వాడిని కాదని అనడం ట్విస్ట్. చంద్రబాబు ఈ కామెంట్ చేయడం ద్వారా సోము వీర్రాజును సున్నితంగా హెచ్చరించారనే చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tenssion-before-somu-veeraju-nominatio-39-194239.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.