Publish Date:Sep 18, 2020
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయంతో పాటు పలు ప్రార్ధనా ప్రదేశాలలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో బీజేపీ చలో అమలాపురం అని పిలుపునిచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమ్యారు. బీజేపీ నేతలు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లకుండా నిరోధించడానికి అర్ధరాత్రి నుంచే పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. ఐతే పోలీసుల కళ్లు గప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గత రాత్రి అమలాపురం చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని రాత్రంతా కారులోనే తిప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర సహాయమంత్రి హోదా కలిగిన తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలను హౌస్ అరెస్ట్ చేసారు. బీజేపీ చలో అమలాపురం పిలుపుతో బయట ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తారన్న అనుమానంతో స్థానిక వ్యాపారులు స్వచ్ఛందగా షాపులు మూసివేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tension-prevails-in-amalapuram-after-police-arrests-bjp-leaders-39-104172.html
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.