తెలుగుదేశం కార్యకర్తల పార్టీ.. మహానాడు వేదికగా మరోసారి తిరుగులేని రుజువు

Publish Date:May 28, 2022

Advertisement

ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీని నడిపించింది..ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నది కార్యకర్తలే. మహానాడు వేదికగా ఆ విషయం మరోసారి రుజువైంది. 2019 ఎన్నికలలో దారుణ పరాజయం తరువాత మూడేళ్లలోనే మళ్లీ అద్భుతంగా తెలుగుదేశం పుంజుకోవడానికి కారణం తెలుగు తమ్ముళ్లే. 2019లో జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులు, దాడులు, ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్యలతో పెట్రేగిపోయారు. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేనంతగా వైసీపీ అరాచకాలు శృతి మించాయి.

నేతలు అడుగు బయటపెట్టడానికి కూడా జంకే పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొందరైతే జావగారిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే కార్యకర్తలు మాత్రం బెదరలేదు. భయపడలేదు. మడమ తిప్పలేదు. ఎక్కడికక్కడ వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారు.   వైసీపీ దాడులకు గుండెలడ్డేసి నిలబడ్డారు. ఫలితం.. ప్రజలలోనూ వైసీపీ అరాచకాలను నిలదీసి ప్రశ్నించే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంతులు, ఎమ్మెల్యేలను నిలదీసి ప్రశ్నించేలా చేసింది.

నిరసన సెగలను తట్టుకోలేక వారు ‘గడపగడపకూ’ మొహం చాటేశారు. అంతెందుకు ముఖ్యమంత్రి జగన్ సభనే జనం బాయ్ కాట్ చేసే ధైర్యం ప్రజలకు రావడానికి కారణం తెలుగుదేశం కార్యకర్తల సాహసం, పట్టుదలే. ఇంకానా ఇకపై సహించం అంటూ జనం ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదిరించే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే వచ్చింది. రైతు భరోసా కార్యక్రమంలో జగన్ ప్రశ్నిస్తుండగానే జనం నిరసన వ్యక్తం చేస్తూ ‘వాకౌట్’ చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా లేక్క చేయలేదు. ఆ ధిక్కారం తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యమే. మహానాడు వేదికగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఇదే చెప్పారు. తెలుగుదేశం బలం కార్యకర్తలేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామన్న విషయాన్ని లక్షలాదిగా మహానాడుకు తరలి వచ్చి మరీ తెలియజేశారు.  

బస్సులు అందుబాటులో లేవు, పార్టీ పరంగా జనసమీకరణ జరగలేదు.  ఊళ్లకు ఊళ్లు   ట్రాక్టర్లు.. కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్లు ఇలా ఏది దొరికితే అది పట్టుకుని స్వచ్ఛందంగా తరలి వచ్చారు.  మహానాడుకు ఈ స్థాయిలో జనం తరలి వస్తారని పార్టీ వర్గాలు కూడా ఊహించలేదు. జరుగుతుందని టీడీపీ వర్గాలు కూడా ఊహించలేదు.  సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ  ఐక్యమౌతున్నారు.

నాయకుల పిలుపు కోసం చూడకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటున్నారు. ఆ స్ఫూర్తి మహానాడులో ప్రస్ఫుటమైంది.  నాయకులు పార్టీలు మారినా క్యాడర్ స్థిరంగా తెలుగుదేశంతోనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ అంటూ  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు నుంచీ, ప్రస్తత అధినేత చంద్రబాబు వరకూ ఈ నాలుగు దశాబ్దాలుగా ఏదైనా నమ్మారో, ఏదైతే చెబుతూ వచ్చారో అది నూటికి నూరుపాళ్లు నిజమని మహానాడు మరోసారి రుజువు చేసింది.

 మహానాడుకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. సభకు వెళ్లిన వారి వివరాలు తెలుసుకుని పథకాలు ఆపేస్తామని బెదరింపులకు దిగింది. మీకు మీ పథకాలకూ ఓ దండం అంటూ వైసీపీ బెదరింపులను ఖాతరు చేయకుండా తరలి వచ్చారు.   జగన్ ముందస్తు యోచన చేస్తుంటే.. మేం రెడీ తెలుగుదేశం క్యాడర్ సమర శంఖం మోగించేసింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (మే 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలి వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-19
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు.
సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.
ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.
చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.