Publish Date:May 15, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరించిందన్న భావన తెలుగువారిలో మరీ ముఖ్యంగా ఆంధ్రులలో చాలా బలంగా ఉంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు.. ఉద్దేశపూర్వకంగా ఏపీకి, ఏపీ ప్రయోజనాలకూ భంగం వాటిల్లే విధంగానే ఉందన్నది ఆంధ్రుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది.
2019 ఎన్నికలలో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీ విజయం సాధించకపోవడమే కాకుండా, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దిక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఏపీలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి అప్పుడు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఇప్పుడు తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీకి తెలుగువారి ఆగ్రహ జ్వాల సెగ గట్టిగానే తాకింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు అధికంగా ఉన్న ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగువారు స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు అక్కడి పరిశీలకులు చెబుతున్నారు.
2018లో జరిగిన కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసింది. అయితే తాజా ఎన్నికలలో మాత్రం తెలుగుదేశ పార్టీయే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. చివరాఖరికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో బీడీఎస్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎక్కడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పి బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
ఇక కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటే ఎనిమిది జిల్లాల్లోని 49 స్థానాలలో బీజేపీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాలలోనే విజయం సాధించడమే తెలుగు ప్రజలు బీజేపీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలు సహా దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. దీనిని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలుతోంది. సరిహద్దు జిల్లాలైన కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు. ఇక మొత్తంగా తెలుగు వారి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న జిల్లాలు కర్నాటకలో రమారమి 10 వరకూ ఉంటాయి. ఆ పది జిల్లాలలోనూ కలిపి బీజేపీ గులుచుకున్నవి 9 స్థానాలు మాత్రమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugu-people-have-no-trust-in-bjp-39-155312.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.