రాజమహేంద్ర వరానికి మహానాడుతో పసుపుశోభ

Publish Date:Mar 30, 2023

Advertisement

వేదంలా ఘోషించే గోదావరి... అమర ధామంలా శోభిల్లే  రాజమహేంద్రి... శతాబ్దాల  చరితగల  సుందర  నగరం .. గత  వైభవ  దీప్తులతో  కమ్మని  కావ్యం.. అలాంటి రాజమహేంద్రవరం మహానగరం పసుపు శోభ సంతరించుకోనుంది. తెలుగుదేశం మరికొద్ది రోజుల్లో పసుపు కళ సంతరించుకోనుంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి. అలాగే ఆ   మహానాయకుడి శత జయంతోత్సవ సంవత్సరం. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మహా పండగ అయిన మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దీంతో రాజమండ్రి వేదికగా  మహానాడు బహిరంగ సభకు పార్టీ అధిష్టానం కమిటీని  ఏర్పాటు చేయనుంది. 

 అలాగే ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సభలలో ఒకటి హైదరాబాద్ వేదికగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ 100 సభలు నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం.. తెలుగురాష్టరాలలోని 42 నియోజకవర్గాల కేంద్రాలలోనూ ఒక్కో సభ నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 58 సభలో వివిధ నగరాలు, పట్టణాలలో నిర్వహిస్తుంది. వందో సభ మహానాడు సభతో ముగుస్తాయి.  

ఇక జగన్ ప్రభుత్వం అలంబిస్తున్న ప్రజా వ్యతికేర విధానాలపై టీడీపీ ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి  బలంగా తీసుకు వెళ్లింది. అలాగే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టో విభిన్నంగా ఉండడమే కాకుండా, ప్రజలందరికీ చేరువ అయ్యే పథకాలతో రూపొందించే దిశగా ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆర్థిక అసమానతలు లేకుండా.. ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా పథకాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా .. ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సంసిద్దం చేసేందుకు టీడీపీ అధినాయకత్వం   ముందుకెళ్తోంది. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేళ.. ఆయన పేరిట 100 రూపాయిల నాణాన్ని  విడుదల చేయనున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  మరోవైపు గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే తెలంగాణలో ఖమ్మం వేదికగా జరిగిన శంఖారావ సభ సైతం సూపర్ సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఇక మార్చి 29న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.   తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిలో 100 స్థానాలలో  ఇప్పటికిప్పుడు అభ్యర్థులను దింపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...బీఆర్ఎస్, బీజేపీలలో కలవరం రేపాయి. 

ఇంకోవైపు ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నలుగురు ఘన విజయం సాధించారు. దీంతో అధికార జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా క్లియర్ కట్‌గా స్పష్టమైందని తేటతెల్లమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర ప్రభంజనంలో దూసుకుపోతోంది. ఇక తెలుగుదేశం మహానాడును రాజమండ్రిలో  నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.    2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకుగాను.. 14 స్థానాలను టీడీపీ గెలుచుకోగా.. ఒక్క స్థానం నుంచి తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 

అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకుగాను.. 12 టీడీపీ, ఒకటి బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం అన్ని స్థానాలను  గెలుచుకునే వ్యూహంలో భాగంగానే మహానాడు ను గోదావరి ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారనే చర్చ సైతం ఊపందుకొంది.

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.