హేట్సాఫ్ టీడీపీ

Publish Date:Jul 1, 2015

Advertisement

 

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ  నాయకులు, కార్యకర్తలు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు కార్యకర్తలను, నాయకులను కూరలో కరివేపాకులా వాడుకుని అవతల పారేస్తూ వుంటాయి. అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీది కార్యకర్తలను, నాయకులను గుండెలో పొదువుకుని కాపాడుకునే పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీని తాలు, వేస్టేజీ లాంటి నాయకులు వదలి వెళ్ళిపోయారే తప్ప అసలైన నాయకులు, కార్యకర్తలు పార్టీకి ఎప్పుడూ వెన్నంటే వున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతను కనబరుస్తూనే వున్నారు. పార్టీ పదేళ్ళపాటు అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ జెండాలు భుజాన పెట్టుకుని మోశారు. అధికార పార్టీల కుయుక్తులను ఎదుర్కుంటూ పోరాటాలు చేశారు. అలాంటి కార్యకర్తలు, నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య వున్న ఆత్మీయతానుబంధం నిరంతరం పెరుగుతూనే వుంటుంది. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల కోసం, వారి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలోని ఏ పార్టీ చేయడం లేదని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎంత అండగా వుంటుందో తాజాగా జరిగిన రేవంత్ రెడ్డి ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పన్నిన కుట్రలో రేవంత్ రెడ్డి ఇరుక్కున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఆ పార్టీ కార్యకర్తల చేత హేట్సాఫ్ చెప్పించుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మద్దతు కారణంగానే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ధైర్యంగా సమస్యను ఎదుర్కొన్నారు. పార్టీ ఇచ్చిన ధైర్యమే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పన్నిన పద్మవ్యూహంలోంచి పాక్షికంగా బయటపడటానికి కారణమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ ద్వారా విడుదలైన శుభ సందర్భంలో కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద వున్న కృతజ్ఞతాభావం ఎంతో స్పష్టంగా కనిపించింది.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.