కర్నూలులో తెలుగుదేశం కార్యకర్తపై దాడి.. నలుగురు వైసీపీయులు అరెస్టు

Publish Date:Jun 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ  కర్నూలో   ఉద్రిక్తతకు , హింసకు దారితీసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగే తప్పులను ఎత్తిచూపినందుకు తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  ఓటర్ల జాబితాలో   అక్రమాలు, తప్పులను వెలికితీసి ప్రశ్నించినందుకే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలు రాజకీయవేడిని రగిలచ్చాయి. 

కర్నూలులో తెలుగుదేశం  కార్యకర్త తైజుం బాషాపై   హత్యాయత్నం జరిగింది. బాధితుడు తైజుం బాషా తన ఇంటి సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుండగా, పథకం ప్రకారం అతడిపై వైసీపీయులు దాడికి పాల్పడ్డారు.  కర్రలు, రాళ్లతో బాషాపై   జరిగిన ఈ దాడిలో బాషా తీవ్రంగా గాయపడ్డాడు.  ప్రస్తుతం  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు.  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికారికంగా జరుగుతున్న కొన్ని అక్రమాలను, తప్పుడు ఓట్ల నమోదును తైజుం బాషా నిలదీసినందుకే ఈ దాడి జరిగిందని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల  విచారణలో ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నలుగురు నిందితులను  అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను జలీల్, జునైద్, ఫైజల్,  ఆరిఫ్‌లు నలుగురూ వైసీపీ నేత,  మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు.  నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం  పోలీసులు వారిని  పీఎస్ నుంచి   కొండారెడ్డి బురుజు వరకు కాలినడకన రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదనే హెచ్చరికను పంపేందుకే పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.   

By
en-us Political News

  
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.