తెలంగాణ పోలీసుల ఆరోగ్య భద్రత పథకం రద్దు.. ఎందుకంటే?

Publish Date:Jul 1, 2026

Advertisement

తెలంగాణ పోలీసు సిబ్బందికి దశాబ్దాలుగా కొండంత అండగా నిలిచిన  ఆరోగ్య భద్రత నగదు రహిత   వైద్య చికిత్స పథకం రద్దైంది. బుధవారం (జులై1 )నుంచి ఈ పథకాన్ని  నిలిపివేస్తున్నట్లు డిజిపి, ఆరోగ్య భద్రత పథకం చైర్మన్ అయిన సీవీ ఆనంద్  సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్తగా  ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త విధానం ప్రకారం, జూన్ నెలకు సంబంధించిన జీతాల నుండి ఉద్యోగుల బేసిక్ పే,  పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుండి 1.5 శాతం చందాను రికవరీ చేయాలని ప్రభుత్వం జీవో 79 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా, జూలై 1న చెల్లించే జూన్ జీతాల నుండి పాత ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను నిలిపివేశారు.

గత కొంతకాలంగా ఆరోగ్య భద్రత పథకం   నిధుల కొరతతో సతమతమౌతోంది. ఈ పథకం కింద ప్రతి నెలా దాదాపు 3వేల వైద్య బిల్లులు వస్తుండటంతో.. పాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ఎలాంటి అదనపు రీఇంబర్స్‌మెంట్లు వచ్చే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30,  అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఇహెచ్‌సిటి   విధానంలో ఉద్యోగుల నుండి వసూలు చేసే 1.5 శాతం చందా మొత్తాన్ని వైద్య, ప్రజారోగ్య అవసరాల కోసం కేటాయించిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఒకే కుటుంబంలో డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తి నుండి రెండుసార్లు చందాలు కట్ కాకుండా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి అయి మరొకరు పెన్షనర్ అయినా, లేక ఒకే పెన్షనర్ సర్వీస్,  ఫ్యామిలీ పెన్షన్లు రెండూ పొందుతున్నా... కేవలం ఒక్కరి నుండి మాత్రమే ఈ చందా  సేకరిస్తారు. 1999లో ప్రారంభమై, పోలీస్ శాఖలో అత్యంత ఆదరణ పొందిన ఈ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డ్ వ్యవస్థ  రద్దు కావడం పట్ల పోలీసు సిబ్బందిలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
లలితా జ్యువెలరీ మరియు హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓల మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లిస్టింగ్ లాభాలు, ప్రైస్ బ్యాండ్ మరియు డే 2 సబ్‌స్క్రిప్షన్ వివరాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.