Publish Date:Jul 15, 2022
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు. వాస్తవానికి ఆమె తెలంగాణా కూడా పర్యటించాల్సి వుంది. కానీ సమయం అంతగా లేకపోవడంతో ఆమె తన పర్యటనను ఆంధ్రాతో ముగించి వెనుదిరిగారు. కాగా బీజేపీ నేత రాజా సింగ్, ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్ గురువారం గోవా వెళ్లి ద్రౌపది ముర్ముతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించారు.
గిరిజనుల జనాభా గురిం చి ఆమె తెలుసుకోవాలనుకున్నారు. ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజన జనా భా అధికంగా ఎక్కడున్న ది తనను కలిసిన తెలంగాణా నాయకుల నుంచి తెలుసుకున్నారు. ఆమె ఒరి స్సా గిరిజనుల తెగకు చెందిన వారు. గిరిజనులకు తాను భవిష్యత్తులో మేలు చేయాలని ఆశించి వుండ వచ్చు.
గురువారం తనను కలిసిన బిజెపి నాయకుల ద్వారా తెలంగాణ, ఏపీల్లో గిరిజనుల స్థితిగతులపై వివరా లు తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపి నట్లు సమాచారం. తెలంగాణాలో గిరిజనుల గురించి తెలం గాణా బిజెపి ఎమ్మె ల్యేలు వివరించి వారి సంక్షే మానికి తోడ్పడాలని కోరినట్టు తెలుస్తోంది.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను, ఈటల రాజేందర్ గెలిచిన తీరును ద్రౌపది ముర్ముకు వివ రించినట్లు ఎమ్మెల్యే రఘునందన్రావు వెల్లడించారని తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థి తులను ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు. ఇదిలా వుండగా, అసలు ఆమె గతంలో ఝార్ఖండ్ గవర్నర్గా వున్నపుడు గిరిజనులకు ప్రత్యేకించి ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదన్నది బిజెపీ యేతర పార్టీల ఆరోపణలు. ఏమయినప్పటికీ, ఇపుడు ప్రచారంలో భాగంగా వచ్చి ప్రత్యేకించి గిరిజనుల గురించి వాకబు చేయడం తప్పకుడా ఆమె భవిష్యత్తులో వారికి మేలు చేయా లన్న ఆలోచనలోనే వున్నట్టు అర్ధంచేసుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-mlas-meet-murmu-25-139806.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.