Publish Date:Oct 30, 2020
తెలంగాణలో ఓ మంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మంత్రి రాసలీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఆ మంత్రి వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఆ మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలో పడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాట్సాప్ చాటింగ్ వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సినీ నటితో సరసాలు చేయాలనుకున్నారు. అయితే, ఆ విషయం ఆమెతో నేరుగా చెప్పకుండా మరో మహిళను రంగంలోకి దింపాడు. మంత్రి తరఫున రంగంలోకి దిగిన ఆ మహిళ సినీ నటితో చర్చలు మొదలు పెట్టింది. మంత్రి చాలా మంచి వాడని, అతడితో చాలా పనులు ఉంటాయని, టచ్లో ఉంటే మంచిదంటూ చెప్పడం మొదలు పెట్టింది. అయితే, ఆ సినీ నటి ఇవేవీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి నియమించిన మహిళ ఏకంగా మరో దుశ్చర్యకు పాల్పడింది. ఆ సినీ నటికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను కూడా తీసింది. ఆ ఫొటోలను మంత్రికి పంపించింది.
ఆ మహిళతో ఏదో మామూలుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మహిళ సెల్ ఫోన్ చూసిన సినీ నటికి అందులో తన ప్రైవేట్ ఫొటోలు ఉండడం గమనించి షాక్ తింది. ఆ సినీ నటి గురించి మంత్రితో మహిళ చర్చించిన అంశాలు కూడా వాట్సాప్ ఛాటింగ్ లో ఉన్నాయి. దీంతో మరింత షాక్ తిన్న సినీ నటి .. ఆ మహిళ ఫోన్ తీసుకుని ఆ సమాచారం మొత్తం స్క్రీన్ షాట్లు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెబుతున్నారు.
'మన దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన హింసాకాండ. మన రాష్ట్ర రాజధానిలో దిశపై జరిగిన హింసాకాండ. నేటికీ ఏ మార్పు రాలేదు. మహిలలపై ఈ హింసని మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆపలేమా? మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం నమ్మిన నాయకులే మహిళలపై రాక్షస వాంఛతో ప్రవర్తిస్తే వాళ్లని ఏం చేయాలి?' అంటూ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణలోని ఓ ప్రముఖ పట్టణంలోని హోటల్లో ఆమె ఉన్నప్పుడు సదరు మంత్రి ఒంటరిగా హోటల్కు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. యువతి బస చేసిన హోటల్లో రికార్డులను ప్రభుత్వ ఇంటిలిజెన్స్ పరిశీలించినట్టు సమాచారం. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-minister-whatsapp-chat-leaked-25-105748.html
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.