ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ కిరికిరి.. యాసంగి రైతుకు దారేది? 

Publish Date:Nov 30, 2021

Advertisement

యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఒక్క గింజ వరి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనిగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు. అందుకు కారణం కూడా ఆయన అంత స్పష్టంగానూ చెప్పారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్ కొనమని తెగేసి చెప్పింది. కాబట్టి, రాష్ట్రానికి కొనే ఆర్థిక స్థోమత, నిల్వ సామర్ధ్యం లేవు కాబట్టి, రాష్ట్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా చావు కబురు చల్లగా చెప్పారు. 

నిజానికి ఇదే ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా, వరి పంట విస్తీర్ణం 78లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు చేరినా, 225 లక్షల టన్నులున్న వరి పంట ఇంకా పెరిగినా, వరి పంటకు బ్రహ్మాండమైన ధర వస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. వరి పంటను ప్రోత్సహించాలని, సభాముఖంగా వ్యవసాయ మంత్రిని ఆదేశించారు. అంతే కాదు రాష్ట్రంలో వరి పంట ఇంకింత పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందని హామీ ఇచ్చారు. అయితే,అదే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వేషం మార్చారో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో ఆయన స్వరం మారి, చివరకు కేంద్రం కొంటేనే కొంటాం, అనే వరకు వచ్చారు. కేంద్ర చేతులు ఎత్తేసింది కాబట్టీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందని చెప్పుకొచ్చారు.  

అయితే, ఇక్కడ తప్పు  కేంద్రానిదా? రాష్ట్రనిదా? అనే చర్చను పక్కన పెట్టి, ఇప్పుడు రైతు ముందున్న ప్రత్యాన్మాయం ఏమిటని ఆలోచిస్తే, శూన్యం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు  పండ్ల తోటల సాగుకు అవసరమైన పనిముట్లు ఇతర ఇంపుట్స్’పై ఇచ్చిన సుబ్సిడీలను ఎత్తివేసింది. పందాల్ తోటల సాగుకు మంగళం పాడింది. పత్తి.  మిర్చి, పప్పు ధాన్యాలు, ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు,  పసుపు  ఏ పంటకు సరైన ధర రాక రైతులు  దగా పడ్డారు.ఇదే విషయాన్ని, ఈరోజు రేవంత్ రెడ్డి  ప్రభుత్వానికి గుర్తు చేశారు. నిజానికి, ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నట్లుగా,  ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెరాస, బీజేపీ పార్టీలు కలిసి రైతులను మోసంచేస్తున్నాయి. రాజకీయ చదరంగంలో పావులుగా చేసి ఆడుకుంటున్నాయి అన్నది నిజం. 

ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలు, మెట్టపంటలపై రాయితీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు వరి పండిస్తున్నారని అన్నారు.  ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని ప్రశ్నించారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా అని పేర్కొన్నారు. ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ రైతులను బీజేపీ  మోసం చేసిందని... చక్కెర పరిశ్రమలను మూసివేసి కేసీఆర్‌ చెరకు రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయన్నారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నిజం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడా ఇక్కడా అధికారంలో ఉన్న బీజేపీ, తెరాస రాజకీయ ప్రయోజనాలకోసం ఆడుతున్ననాటకంలో రైతులు బాలి పశువులు అవుతున్నారని పరిశీలకులు బావిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.