నోరు మంచిదయితే...

Publish Date:Nov 1, 2014

Advertisement

 

నోరు మంచిదయితే ఊరు కూడా మంచిదవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తనకా సూత్రం వర్తించదని భావిస్తారు. అందుకే ఆంధ్ర పాలకులని, ప్రభుత్వాన్నితిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే, ఆంధ్రపారిశ్రామిక వేత్తలు తెలంగాణా అభివృద్ధికి తోడ్పడాలని కోరగలుగుతారు. ఆంధ్రప్రజల పిల్లలకు ఫీజులు చెల్లించమని తెగేసి చెపుతూనే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాసను జరా గుర్తుంచుకోమని విజ్ఞప్తి చేయగలుతారు. కేంద్రం తన అధికారాలు లాక్కొందని ఒకసారి, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేసిందని ఇంకోసారి, విద్యుత్ ఈయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మరొకసారి, విభజన చట్టం సరిగ్గా అమలు చేయడం లేదని మరొకసారి కేంద్రంపై కత్తులు దూస్తూనే, తెలంగాణాను ఆదుకోవలసిన బాధ్యత మీదేనని నొక్కి చెప్పగలుగుతారు.

 

అయితే అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే పెద్దల మాటను కూడా ఆయన పెద్దగా పట్టించుకొన్నట్లు కనబడరు. అందుకే ఏదో చంద్రబాబు డిల్లీ వెళ్లి వస్తున్నప్పుడు తను వెళ్లకపోతే ప్రతిపక్షాలు అరిచి గోల చేస్తాయని ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆయన డిల్లీ చక్కర్ కొట్టి వస్తుంటారు. అసలు ఎంత కష్టమొచ్చిపడినా అంతా లోకల్ గానే చక్కబెట్టేయాలని చూస్తుంటారు. అందుకే ఆయనగారికి మమ్మల్ని కలిసే తీరిక ఎక్కడుందీ? అని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అప్పుడెప్పుడో సన్నాయి నొక్కులు నొక్కారు కూడా.

 

సాధారణంగా ఎవరయినా కష్టాలలో ఉన్నప్పుడు ఇరుగుపొరుగు సాయమో లేక స్నేహితులు, దూరబంధువుల సాయం కోసమో ప్రయత్నిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి విరుద్దం. కష్టకాలంలో కూడా గిరి గీసుకొని కూర్చోవడమే కాకుండా, అందులోనే కూర్చొని అందరి మీదకి బాణాలు వేస్తూ ఎవరూ కూడా తన దగ్గిరకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. విద్యుత్ ఇస్తామని చెపుతున్న ఆంద్రప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తామని హూంకరిస్తుంటారు. విద్యుత్ ఇవ్వలేదని కేంద్రాన్ని మాటలతో జాడించి వదిలి పెడతారు. నీళ్ళు వాడుకోమని చెప్పిన కృష్ణా బోర్డు తమ మీద కక్ష కట్టిందని ఎదురు దాడి చేస్తారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంజనీరింగ్, ఇంటర్ మీడియేట్ కోర్సులు నడుపుకొందామని అడిగితే మాదారి మాదే మీదారి మీదే అంటారు. మరి ఈ స్టైల్లో వ్యవహరిస్తుంటే బంగారి తెలంగాణా ఎలా సాధ్యమో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

 

ఏమయినప్పటికీ ప్రభుత్వాన్ని నడపడం అంటే ఉద్యమాలు నడిపినంత వీజీ కాదని స్పష్టమవుతోంది. ఉద్యమంలో ఏదయినా డిమాండ్ చేయవచ్చు, కానీ ఇక్కడ అన్ని ఎక్సప్లనేషన్లు మాత్రమే! కరెంటు ఎందుకు ఇవ్వలేక పోయావని ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారు? అని ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. పొరుగు రాష్ట్రంతో, కేంద్రంతో జల సంఘంతో ఎందుకు తగవులాడవలసి వస్తోందో ప్రజలకి ఎక్సప్లనేషన్ ఈయాలి. ఈ ఐదేళ్ళపాటు బాగా రాటు తేలితేనే కానీ ఏదీ సెట్ అయ్యేట్లు లేదు మరి!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.