Publish Date:Apr 13, 2026
రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై కొనసాగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించిన అధికారులు అక్రమంగా నిల్వ చేసి, గుప్తంగా విక్రయానికి సిద్ధం చేసిన వేలాది సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఇంటింటికీ చేరాల్సిన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు కొంతమంది దందాగాళ్ల చేతుల్లో బ్లాక్ మార్కెట్ సరుకుగా మారుతున్నాయన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో ఒకేసారి దాడులు చేపట్టగా అక్రమ వ్యాపారం విస్తృత స్థాయిలో నడుస్తున్నట్లు బయటపడింది. ఇప్పటివరకు 5,079 గృహ వినియోగ సిలిండర్లు, అదనంగా 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
సబ్సిడీ గ్యాస్ను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాలు ప్రజల భద్రతకే ముప్పుగా మారుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,089 కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
“గ్యాస్ సిలిండర్ ప్రజల అవసరానికి సంబంధించినది… దందాకు కాదు” అని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సిలిండర్ల నిల్వ, రవాణా లేదా విక్రయాలు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ఈ బ్లాక్ మార్కెట్ దందాను పూర్తిగా అరికట్టాలని సివిల్ సప్లైస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-civil-supplies-department-operation-36-217275.html
ఈ లీగల్ బ్యాటిల్లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.