రాజకీయ వ్యవస్థల చేతిలో రాజ్యాంగ ప్రక్రియ ఓటమి

Publish Date:Dec 19, 2013

Advertisement

 

రాష్ట్ర ఉభయ సభలు టీ-బిల్లుపై ఎటువంటి చర్చ జరుపకుండానే రెండు వారాల పాటు నిరవదిక వాయిదా పడ్డాయి. అందుకు భాధ్యులయిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతమాత్రం చింతించకుండా, చింతిస్తున్నట్లుగా అద్భుతంగా నటిస్తూ ఎదుటవారి మీద బురద జల్లుడు కార్యక్రమం మొదలుపెట్టేసారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేము గనుక తాము విజయం సాధించామని తెలంగాణావాదులు భుజాలు చరుచుకొంటుంటే, బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోగలిగామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా భుజాలు చరుచుకొంటున్నారు. ఇదంతా చూస్తుంటే మన రాజకీయాల ముందు మన రాజ్యాంగ ప్రక్రియ పూర్తిగా ఓడిపోయినట్లు స్పష్టం అవుతోంది.

 

టీ-బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కోరుకొంటున్న వారి కళ్ళు తెరుచుకోనేలా దానిపై ధాటిగా తమ వాదనలు వినిపించి ఓడిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లుపై తన వాదన వినిపించకుండా సభ్యులకు క్రమశిక్షణ పాటాలు చెప్పారు. ఇక సమైక్య తీర్మానం చేసేవరకు ఉభయ సభలలో బిల్లుపై ఎటువంటి చర్చ జరుగకుండా అడ్డుకొంటామని వైకాపా నిర్లజ్జగా చెప్పడం చాలా శోచనీయం.

 

ఉభయ సభలలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించే విధంగా ప్రజాప్రతినిధులు తమ వాదనలు వినిపించే బదులు, కేవలం తమ పార్టీ వ్యూహాలకే ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతూ విలువయిన సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేయడం గమనిస్తే తమను చట్ట సభలకు పంపిన ప్రజలపట్ల వారికి ఎంత నిర్లక్ష్యమో అర్ధమవుతోంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణాలు చేసిన సదరు ప్రజాప్రతినిధులు, ఆ రాజ్యంగ వ్యవస్థ పట్ల కూడా అదే నిర్లక్ష, ధిక్కార ధోరణి ప్రదర్శించడం చాలా శోచనీయం.

 

రాష్ట్ర విభజన జరగాలని, వద్దని కోరుకొనేవారు చట్ట సభలలో ఆ విషయాన్ని తమ వాదనల ద్వారా వినిపించి, తమకు అన్యాయం జరిగిందని భావిస్తే అప్పుడు రాష్ట్రపతి లేదా సుప్రీం కోర్టు జోక్యం కోరగలిగేవారు. కానీ, తమకు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా ఉద్దేశ్యపూర్వకంగానే దుర్వినియోగపరచుకొని, ఆ తరువాత రాష్ట్రపతిని, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, అది కేవలం ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు మాత్రమే ఆడుతున్నమరో నాటకమవుతుంది.

 

ఇటువంటి చావు తెలివితేటలు ప్రదర్శించినందుకే డిల్లీలో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను చీపురు కట్టతో ఊడ్చిపడేసారు. అటువంటి రాజకీయ చైతన్యం తెలుగు ప్రజలకు లేదని, అందువల్ల అటువంటి ప్రమాదం ఎన్నడూ తమకు ఎదురవదని మన రాజకీయ పార్టీలు గుడ్డిగా విశ్వసిస్తే అది వారి దౌర్భాగ్యం. ఈ అరాచక వ్యవస్థతో విసిగేత్తిపోయున్న ప్రజలలో నుండి మరో ఆమాద్మీ ఉద్భవించవచ్చు. విలువలు, ప్రజలపట్ల గౌరవం లేని మన రాజకీయ నేతలను వారి పార్టీలను చీపురుతో ఊడ్చిబయట పడేయవచ్చును. అందువల్ల ప్రజాప్రతినిధులు ఇంకా ప్రజల సహనాన్ని పరీక్షించకుండా ప్రజలు తమకు అప్పజెప్పిన భాద్యలను సక్రమంగా నిర్వర్తించడం వారికే మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.