రాష్ట్రంలో సమైక్య, విభజన సభలు

Publish Date:Sep 29, 2013

Advertisement

 

ఈ రోజు రాష్ట్రం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని డిమాండ్ చేస్తూ 'సకల జన భేరి' సభ జరుగుతుంటే, మరో వైపు అదే సమయంలో, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య ప్రజాగర్జన సభ జరుగుతోంది. ఇరు సభలు వారి వారి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పై హక్కులపై ఇరు సభలు బలమయిన వాదనలు వినిపించాయి.

 

ఇక టీ-సభలో ప్రసంగించిన కేసీఆర్ ఒక ఆసక్తికరమయిన సంగతిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీకాలం మరో ఆరు రోజుల్లో(అక్టోబర్ 6) ముగియబోతోందని, అందుకు తనవద్ద ఖచ్చితమయిన సమాచారం ఉందని ప్రకటించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అద్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడవచ్చనే సంకేతమిస్తూ, ఒకవేళ యూపీయే ప్రభుత్వం ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోతే, తరువాత వచ్చే బీజేపీ రాష్ట్ర ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పడం మరో విశేషం.

 

ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంతో ఎన్నికల పొత్తుల ఆలోచనలు చేస్తూనే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం చూస్తే, ఆయన అవసరమయితే బీజేపీతో జతకట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం జేస్తోంది. మరి బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టే ఆలోచనలోఉందని తెలిసినప్పుడు, ఆయన ఈవిధంగా మాట్లాడటం విశేషమే. ఆయన ఈ సనదర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సభలో ప్రసంగించిన కే.కేశవ్ రావు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తగా, అంతకు ముందు ప్రసంగించిన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సుష్మ స్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సభలో ప్రసంగించిన వక్తలు అందరు సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనని వెంటనే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు.

 

ఇక సమైక్య సభలో మాట్లాడిన వక్తలందరూ హైదరాబాదుపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గట్టిగా వాదించారు. విద్యుత్, ఉపాద్యాయ, సాగునీరు,ఆర్టీసీ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘనేతలు రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి సమస్యలు వస్తాయో వివరించారు.

 

వారు రాజకీయ పార్టీలన్నిటికి మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయాలు పక్కనబెట్టి ఇప్పటికయినా స్పష్టమయిన సమైక్యవాదంతో ముందుకు రానట్లయితే రానున్న ఎన్నికలలో గట్టిగా బుద్ధిచెపుతామని హెచ్చరించారు.

 

రెండు సభలలో కొట్టవచ్చినట్లు కనబడిన తేడా ఏమిటంటే, టీ-సభలో తెరాస, బీజేపీ, ఇతర తెలంగాణా ఫోరం నేతలందరూ పాల్గొనగా, సమైక్య సభలో రాజకీయపార్టీలన్నీ దూరంగా ఉన్నాయి. పైగా నేతలకీ, వారి పార్టీలకు ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు చేసారు. అయితే ఉద్యోగులు రాజకీయ నేతలను, పార్టీలను దూరం ఉంచినప్పటికీ, అన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమ నేత అశోక్ బాబుకు విస్పష్టంగా తమ మద్దతు ప్రకటించడం ద్వారా పూర్తి ఐకమత్యం చూపుతూ, తమ పోరాటానికి రాజకీయ పార్టీల అండ అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసారు.

By
en-us Political News

  
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.