తెలంగాణాలో గెలిచి ఓడిన కాంగ్రెస్ పార్టీ

Publish Date:Aug 22, 2013

Advertisement

 

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ప్రకటనతో తెరాస, తెదేపాలపై పైచేయి సాధించినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ సదవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణా ప్రకటన చేసి కేసీఆర్ ను, తెరాసను పూర్తిగా దెబ్బతీయలనుకొన్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం కాస్తా టీ-కాంగ్రెస్ నేతల ఉదాసీనతతో బెడిసికొట్టింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన ప్రకటన చేసిన తరువాత వారెవరూ ఆ ఖ్యాతిని దక్కించుకొనే ప్రయత్నాలేవీ చేయకపోగా, ఇంకా ఏర్పడని తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి పదవికోసం అంతర్యుద్దంలో మునిగిపోయారు. వారి నిర్లిప్తతకు తోడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర ప్రాంతాన్ని దాదాపు స్తంభింపజేసారు.

 

అయినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలలోఎటువంటి ప్రతిస్పందన కనబడకపోవడంతో, అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంటూ కేసీఆర్ చకచకా పావులు కదుపుతూ తెలంగాణాలో తానే అసలయిన హీరోనని నిరూపించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ చురుకుగా కదిలి తెలంగాణా అంశాన్నిమళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులను తనకనుకూలంగా మలచుకొని ముందుకు సాగుతున్నాడు.

 

రాజధాని హైదరాబాద్ ను పంచుకొనే విషయంలో, ఆంద్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆతనిని తెలంగాణా ప్రజల హీరోగా నిలబెడితే, హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తూ మాట్లాడిన టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా విలన్లుగా మిగిలిపోయారు. నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంలో సరిగ్గానే ప్రతిస్పందించినపటికీ, అది తెలంగాణావాదానికి వ్యతిరేఖంగా ఉండటంతో కేసీఆర్ దే పైచేయి అయ్యింది.

 

ఇంతకాలం తెలంగాణా ఈయకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని అధిష్టానాన్ని పదేపదే హెచ్చరించిన టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పూర్తి ఆధిక్యత సాధించగలదని నిబ్బరంగా చెప్పలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో ఏ ఒక్కరికి తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తి పట్టు లేకపోవడం, ఏ ఒక్కరికి అందరినీ కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు లేకపోవడమే. అయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎవరికివారు తామే ప్రధాన నేతగా భావించుకొంటూ, మిగిలినవారిని తమకు పోటీదారులుగా భావించడం విశేషం.

 

తాజా సర్వేల ప్రకారం ఈరోజు ఎన్నికలు జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ కంటే తెరాసకే ఆధిక్యత ఉంటుందని తేలింది. ఈ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నపటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని తెలంగాణా ఏర్పాటు చేస్తున్నపటికీ అది ఆ పార్టీకి లాభం చేకూర్చకపోగా రెండు ప్రాంతాలలో కూడా నష్టం కలిగిస్తోంది. అందుకు ఆ పార్టీ నేతలనే నిందించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేల్కొనకపోతే తెరాసను విలీనం చేసుకోవడం సంగతి దేవుడెరుగు, ఆ పార్టీ రెండు ప్రాంతాలలో కనబడకుండా పోయే ప్రమాదం ఉంది.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.