తెలంగాణా క్యాబినెట్ నిర్ణయాలు

Publish Date:Jul 16, 2014

Advertisement



నిన్న సుమారు ఐదున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణా ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో 48 అంశాలపై చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అన్నిటినీ ఈ సమావేశంలో ఆమోదించారు.

 

ఈ సమావేశంలో హైలైట్స్:

 

రుణాల మాఫీ:

1. పంట, బంగారు, పవర్ లూమ్, వ్యవసాయం కోసం తీసుకొన్న ట్రాక్టర్లు, ట్రాలీల ట్రాన్స్ పోర్ట్ పన్నుబకాయిలు అన్నీ మాఫీ చేయబడ్డాయి. వాటిలో వ్యవసాయ మరియు బంగారు నగలపై తీసుకొన్న రుణాలు మొత్తం దాదాపు రూ.17-19000 కోట్లు. పవర్ లూమ్ రుణాలు రూ. 6.50కోట్లు, ట్రాక్టర్లు వగైరాల ట్రాన్స్ పోర్ట్ పన్ను బకాయిలు రూ. 76 కోట్లు.

 

సంక్షేమం పధకాలు:

1. వృద్ధులు, వితంతువులు, మరియు బీడీ కార్మికులకు నెలకు రూ 1000 పెన్షన్ మంజూరు.

2. వికలాంగులకు నెలకు రూ. 1500 పెన్షన్ మంజూరు. ఈ మూడు రకాల పెన్షన్లు వచ్చే దసరా-దీపావళి పండుగల మధ్య నుండి ఇవ్వబడతాయి. అందుకోసం అర్హులందరికీ పెన్షన్ కార్డులు, బ్యాంకు అకౌంటులు ఏర్పాటు చేయబడతాయి.

3. ఫీజు రీయింబర్స్ మెంటు స్థానంలో తెలంగాణా విద్యార్ధులకు ఆర్ధిక సహాయం. ఇది విద్యార్దుల అవసరాన్ని బట్టి పెంచబడుతుంది.

4. 1969 నుండి తెలంగాణా పోరాటంలో పాల్గొని అమరులయిన వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సహాయం, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయాలు. ఉద్యోగానికి అర్హులు కాని గ్రామస్తులకు 3ఎకరాల భూమి. వ్యవసాయానికి అవసరమయిన అన్ని సదుపాయాల కల్పనా, ఆర్ధిక సహాయం.

5. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద యస్సీ. ఎస్టీ, గిరిజన, ఆదివాసీల ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరపున రూ.50, 000 బహుమానం.

6. గిరిజనులు, ఆదివాసీలు, యస్సీ, ఎస్టీ ఒక్కో కుటుంబానికి 3ఎకరాల భూమి. 7. ముస్లిం ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు.

8. గల్ఫ్ వర్కర్స్ సంక్షేమం కోసం కేరళ తరహాలో ప్రత్యేక సంక్షేమ వ్యవస్థ ఏర్పాటు.

9. అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు తెలంగాణా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం. వారిలో వయసు మీరినవారి కోసం నిబంధనలు సడలింపు.

10. తెలంగాణా ప్రభుత్వోద్యోగులకు తెలంగాణా స్పెషల్ ఇంక్రిమెంటు

11. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీ వేయబడుతుంది. దాని నివేదిక ఆధారంగా జీతభత్యాలు పెంచబడతాయి.

 

కొత్త కమిటీలు, కమీషన్ల ఏర్పాటు:

1. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్.

2. తెలంగాణా పర్యాటక కార్పోరేషన్.

3. తెలంగాణా కాలుష్య నివారణ సంస్థ.

4. తెలంగాణా ఎన్నికల కమీషన్.

5. తెలంగాణా వ్యవసాయ విద్యాలయానికి స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు.

6. తెలంగాణా పశు విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహ రావు పేరు ఖరారు.

7. జ్యూడిషియల్ అధికారాలతో కూడిన వక్ఫ్ బోర్డు ఏర్పాటు.

8. యస్సీ కమీషన్ ఏర్పాటు.

9. మేధావులు, జర్నలిస్టులు తదితరులతో కూడిన ప్రజా సలహా సంఘం ఏర్పాటు (రాష్ట్ర సలహా సంఘం). ఇది ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి ప్రజా సలహా సంఘాలు ఏర్పాటు చేయబడతాయి.

 

పోలీసు విభాగం:

1. హైదరాబాదులో పోలీసు భద్రత పెంచేందుకు అవసరమయిన కార్లు, మోటార్ సైకిళ్ళు కొనుగోలుకు రూ 343 కోట్లు మంజూరు.

2. ఈ కొత్త వాహనాలు నడిపేందుకు 3620 డ్రైవర్లు, పోలీసు కానిస్టేబుళ్ల నియామకం

3. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన డీ.యస్పీ.ల గౌరవం కాపాడేందుకు సూఒపార్ న్యూమరరీ పోస్టులు కల్పించి వారందరికీ అదే స్థాయిలో ఉద్యోగభద్రత, హోదా కల్పించేందుకు ఆమోదం.

4. హైదరాబాదు జంట నగరాలలో అడుగడుగునా సీసీ కెమెరాల్ ఏర్పాటు.

5. జంట నగరాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు విదేశీ కన్సల్టెంట్ తో ఒప్పందానికి అనుమతి మంజూరు.

6. గతంలో జంట నగరాలలో బలవంతంగా మూయించి వేసిన కళ్ళు దుఖాణాలను మళ్ళీ తెరిపించేందుకు చర్యలు.

 

ఇతర నిర్ణయాలు:

1. కోయ, చెంచు మొదలయిన గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలు 500కి మించి జనాబా ఉన్నవాటిని గ్రామ పంచాయితీలుగా మార్పు.

2. వారికి ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి.

3. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణా రాజముద్రలో చిన్న మార్పులు.

4. బ్రతుకమ్మ, బోనాలు పండుగలు ఇకపై రాష్ట్ర పండుగలు.

5. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్.యంపీ. పీ.యంపీలకు అవసరమయిన వైద్య శిక్షణ ఇచ్చి, వారు నిర్భయంగా వైద్య సేవలు అందించేందుకు గాను సర్టిఫికెట్లు కూడా ఇవ్వబడతాయి.

6. పరిశ్రమలకు అవసరమయిన అన్ని అనుమతుల మంజూరు కొరకు సింగిల్ విండో పద్ధతి అమలు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.