మరికొద్ది సేపటిలో కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభం

Publish Date:May 31, 2015

Advertisement

 

మరి కొద్దిసేపటిలో తెలంగాణా శాసనమండలి ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తరువాత 5గంటలకు ఓట్లు లెక్కింపు చేసి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. యం.యల్యే.ల కోటా క్రింద జరుగుతున్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

 

తెరాస తరపున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్ రావు,యాదవ రెడ్డి, బి.వెంకటేశ్వరులు అభ్యర్ధులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేంద్ర రెడ్డి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు యం.యల్యేలు వైకాపాకు చెందిన ఒక యం.యల్యే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించగా, చెరో ఒక్క సీటు ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.

 

ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 18మంది, తెదేపా(11), బీజేపీ(5) లకు కలిపి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధికి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు ఇస్తే తప్ప ఎన్నికలలో గెలవలేరు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధికి ఆ పార్టీకి చెందిన అందరు యం.యల్యేలు తప్పకుండా ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస వైపు మళ్ళినా ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు అనుమానమే. ఇక తెదేపాకు చెందిన మాధవరం కృష్ణారావు మొన్న తెరాసలోకి పార్టీ ఫిరాయించడం, పార్టీ సీనియర్ యం.యల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు నిన్న అరెస్ట్ చేయడంతో తెదేపా యం.యల్సీ. అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగానే కనబడుతోంది.

 

తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 8మంది యం.యల్యేలను తెరాస ఆకర్షించగలిగినప్పటికీ వారందరికీ కూడా ఆ రెండు పార్టీలు విప్ జారీ చేసినందున, వారు తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వారు అందుకు సిద్దపడి ఓటు వేస్తారా లేదా అనే దానిపై తెరాస ఐదవ అభ్యర్ధి జయాపజయాలు నిర్ణయం అవుతాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమ ఐదవ అభ్యర్ధిని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కనుక కాంగ్రెస్, తెదేపాల నుండి తెరాసలో చేరిన ఆ పార్టీల యం.యల్యేలు తమ పార్టీలు జారీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఒకవేళ ఇదంతా ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయడానికే తెరాస అధ్యక్షుడు పన్నిన వ్యూహమయితే చివరి నిమిషంలో తెరాస తన ఐదవ అభ్యర్ధిని పక్కనబెట్టినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.